Begin typing your search above and press return to search.

అల్లువారి 500 కోట్ల రామాయణం రెడీ

By:  Tupaki Desk   |   23 Feb 2018 10:14 AM GMT
అల్లువారి 500 కోట్ల రామాయణం రెడీ
X
రామాయణ గాధను భారీ చిత్రంగా రూపొందించే ప్రతిపాదన గతేడాది వచ్చిన సంగతి తెలిసిందే. తెలుగు.. తమిళ.. హిందీ భాషలలో రూపొందనున్న ఈ రామాయణానికి.. అల్లు అరవింద్ కూడా ఒక నిర్మాత. ఇప్పుడీ అల్లు వారి రామాయణానికి రంగం సిద్ధమవుతోంది.

కొన్ని నెలల పాటు ఎక్కడా మాట వినిపించకపోయే సరికి.. ఈ ప్రాజెక్టును పట్టించుకోవడం లేదనే అనుమానాలు వినిపించిన మాట వాస్తవమే. కానీ ఇప్పుడీ చిత్రానికి సంబంధించి లేటెస్ట్ అప్ డేట్ తెలిస్తే.. ప్రొడ్యూసర్స్ ఎంత చురుగ్గా ఉన్నారో.. ఈ ప్రాజెక్టుపై ఎంత సీరియస్ గా ఉన్నారో తెలుస్తోంది. ప్రస్తుతం లక్నో సిటీలో యూపీ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2018 జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక్కడే ఈ మూవీ ప్రాజెక్టుకు సంబంధించిన ఒప్పందం కూడా జరగడం విశేషం. ఉత్తరప్రదేశ్ లో రామాయణంను తెరకెక్కించేందుకు.. యూపీ ప్రభుత్వంతో నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఓ నిర్మాత మధు మంతెన వెల్లడించారు.

అయోధ్య నెలవైన ఉత్తర ప్రదేశ్ లోనే రామాయణం అధిక భాగం షూటింగ్ జరుపుకోనుండడంతో.. అక్కడి ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు నిర్మాతలు. 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో దేశంలోనే.. అత్యంత కాస్ట్లీ మూవీగా ఈ సినిమా రూపొందనుంది. మూడు భాగాలుగా రామాయణం రూపొందనుండగా.. మూడు భాషల్లో ఏకకాలంలో ఈ 3డీ రామాయణం విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇంకా ఈ చిత్రానికి క్యాస్టింగ్ ఫైనలైజ్ చేయాల్సి ఉంది.