Begin typing your search above and press return to search.

వాళ్లయిపోయారు..మహేష్ మీద పడ్డాడు

By:  Tupaki Desk   |   1 Aug 2015 12:32 PM GMT
వాళ్లయిపోయారు..మహేష్ మీద పడ్డాడు
X
పవన్ కళ్యాణ్ తో మొదలుపెట్టాడు.. అత్తారింటికి దారేది విడుదల సమయంలో పవన్ ను ఆకాశానికెత్తేశాడు. అతను సునామీ స్టార్ అన్నాడు. ఆ తర్వాత గాలి ఎన్టీఆర్ మీదికి మళ్లింది. టెంపర్ రిలీజ్ టైంలో చిన్న ఎన్టీఆర్ ముందు పెద్ద ఎన్టీఆర్ వేస్ట్ అని తేల్చేశాడు. తాజాగా బాహుబలి విడుదల సమయంలో స్టార్లందరి గాలి తీసేసేలా మాట్లాడాడు. ఇప్పుడిక రామ్ గోపాల్ వర్మ కళ్లు ప్రిన్స్ మహేష్ బాబుపై పడ్డాయి. బాహుబలి ఎఫెక్ట్ తో ‘శ్రీమంతుడు’ ఏమైపోతాడో అని మొన్నటి వరకు ఎగతాళి చేసిన వాడే.. ఇప్పుడు శ్రీమంతుడు కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నట్లు చెబుతున్నాడు.

మహేష్ ఇంతకు ముందు సినిమాల్లోనూ చాలా అందంగానే కనిపించాడు జనాలకు. కానీ వర్మకు మాత్రం మహేష్ ఇప్పుడే చాలా గొప్పగా కనిపిస్తున్నాడట. ‘‘శ్రీమంతుడు మహేష్ లుక్ ఫెంటాస్టిక్. ఇంత డాషింగ్ గా, ఇంత ఛార్మింగ్ గా మహేష్ ను ఇంతకుముందెన్నడూ చూడలేదు. ఈ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’’ అని ట్వీట్ చేశాడు వర్మ. ఈ ట్వీట్లు చేయడాని కంటే ముందు శ్రీమంతుడు గురించి ఓ ఆసక్తికర విషయం చెప్పాడు వర్మ. నైజాం డిస్ట్రిబ్యూటర్ ఒకరిని కలిశానని.. శ్రీమంతుడు ఎంత బాగున్నప్పటికీ ఆ సినిమా రిలీజ్ తర్వాత బాహుబలి కలెక్షన్లు పెరుగుతాయని అతను చెప్పాడని వర్మ అన్నాడు. ఈ బిజినెస్ లెక్కలేంటో తనకేమాత్రం అర్థం కాలేదని వర్మ ట్వీట్ చేశాడు.