Begin typing your search above and press return to search.

రాజ‌మౌళిపై వ‌ర్మ ఆస‌క్తిక‌ర ట్వీట్

By:  Tupaki Desk   |   21 May 2017 5:44 AM GMT
రాజ‌మౌళిపై వ‌ర్మ ఆస‌క్తిక‌ర ట్వీట్
X
భారీ క‌లెక్ష‌న్ల‌తో కొత్త రికార్డుల్ని సృష్టించిన బాహుబ‌లి చిత్రంపై ప్ర‌ఖ్యాత ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ తాజాగా మ‌రో ఆస‌క్తిక‌ర ట్వీట్ చేశారు. బాహుబ‌లి సినిమాపై ఆయ‌న చేసినన్ని ట్వీట్లు.. చివ‌ర‌కు ఆ సినిమా నిర్మాత‌లు కూడా చేసి ఉండ‌రేమో. అయితే.. ప్ర‌తిఒక్క‌రిని అన్ని యాంగిల్స్ లో ఏసుకునే వ‌ర్మ‌.. బాహుబ‌లి ఎపిసోడ్‌ లో మాత్రం ఓన్లీ పాజిటివ్ అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించార‌ని చెబుతారు.

తాజాగా బాహుబ‌లి క‌లెక్ష‌న్ల‌ను ప్ర‌స్తావిస్తూ.. ఆ చిత్ర ద‌ర్శ‌కుడు జ‌క్క‌న్న మీద ఆస‌క్తిక‌ర వ్యాఖ్య చేశారు. ప్ర‌స్తుతం రూ.1500 కోట్ల క‌లెక్ష‌న్ల రికార్డును దాటేసిన ఈ చిత్రం రానున్న రోజుల్లో రూ.2వేల కోట్ల‌కు ట‌చ్ చేసి బిజినెస్ క్లోజ్ అయ్యే అవ‌కాశం ఉంద‌న్న మాట వినిపిస్తోంది. క‌లెక్ష‌న్ల ముచ్చ‌ట‌న‌ను కాసేపు ప‌క్క‌న పెట్టి.. వ‌ర్మ ట్వీట్ చూస్తే.. ఈ సినిమా ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి విన‌మ్ర‌త‌.. విధేయ‌త‌లు భ‌యంక‌రంగా అనిపిస్తాయ‌ని వ‌ర్మ ట్వీట్ చేశారు.

బాహుబ‌లి క‌లెక్ష‌న్ల కంటే రాజ‌మౌళి విన‌మ్ర‌త‌.. విధేయ‌త‌లు భ‌యాన‌కంగా అనిపిస్తాయ‌ని. చెప్పారు. ఆయ‌న మాట‌ల‌కు త‌గ్గ‌ట్లే.. క‌ట్ట‌ప్పపై క‌న్నడ సంఘాలు విరుచుకుప‌డ‌టం.. ఈ చిత్రాన్ని ప్ర‌ద‌ర్శించ‌నీయ‌మంటూ ప్ర‌తిన చేయ‌టం.. వారిని స‌ముదాయించ‌ట‌మే కాదు.. బాహుబ‌లి 2 స‌క్సెస్‌ కు కార‌ణ‌మైన ప్ర‌తిఒక్క‌రిని పేరు పేరునా థ్యాంక్స్ చెప్ప‌టం.. తాజాగా బాహుబ‌లి 2 పైర‌సీని కంట్రోల్ చేయ‌టంలో స‌హ‌క‌రించిన పోలీసుల వ‌ద్ద‌కు ప్ర‌త్యేకంగా వెళ్లి మ‌రీ వారికి ధ‌న్య‌వాదాలు చెప్పిన నేప‌థ్యంలో వ‌ర్మ చేసిన ట్వీట్ ఆస‌క్తిక‌రంగా మారింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/