Begin typing your search above and press return to search.

'స్కైప్ డైరెక్షన్' మాత్రమే చేశాను

By:  Tupaki Desk   |   23 Feb 2018 5:26 PM GMT
స్కైప్ డైరెక్షన్ మాత్రమే చేశాను
X

విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన కెరీర్ లో ఎన్నో విమర్శలకు గురయ్యాడు. ఎన్నో వివాదస్పద కారణాల వల్ల ఆయనపై కేసులు కూడా నమోదు అయ్యాయి. కానీ వర్మ ఏనాడు తగ్గలేదు. రౌడి మాదిరిగా తన నిర్ణయాలతో రచ్చ చేస్తూనే వచ్చాడు. అయితే ఈ సారి వర్మ కొంచెం ఆందోళన చెందుతున్నాడా అనే అనుమానం కలుగుతోంది. వర్మను ఎక్కువగా అభిమానించే వారిలో ఆయన ప్రవర్తననే ఎక్కువగా ఇష్టపడతారు.

ఉన్నది ఉన్నట్లు చెప్పడం ఆయనకే సాధ్యం అయ్యిందని అందరూ పొగుడుతుంటారు. అయితే మొదటి సారి వర్మ చేసిన ఒక కామెంట్ ఇప్పుడు ఆయన ఫాన్స్ ని కన్ఫ్యూజన్ కి గురి చేస్తోంది. వర్మను రీసెంట్ గా పోలీసులు విచారణ చేసిన సంగతి తెలిసిందే. జిఎస్ట్ పేరుతో ఆయన చేసిన వీడియో ఇప్పుడు మరింత వివాదాస్పధంగా మారుతోన్న సంగతి అందరికీ తెలిసిందే. ఏ మాత్రం వర్మ జిఎస్టీ డైరెక్ట్ చేశాడు అని తెలిసినా శిక్ష పడుతుందని పోలీసులు తెలిపారు.

అయితే వర్మ మాత్రం తాను డైరెక్ట్ చేయలేదు అని కాన్సెప్ట్ మాత్రమే నాది. వేరేవాళ్లకు ఇచ్చాను స్కైప్ ద్వారా డైరెక్ట్ చేశాను అని చెబుతున్నాడు. దీంతో పోలీసులు ఇప్పుడు టెక్నాలజీ సైడ్ నుంచి కేసును డీల్ చేస్తున్నారు. జిఎస్టీ రిలీజ్ కు ముందు. తానే డైరెక్ట్ చేశాను అని చెప్పిన వర్మ ఇప్పుడు స్కైప్ లో డైరెక్ట్ చేశాను అని చెప్పడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మరి ముందు ముందు ఈ కేసులో ఎలాంటి పరిణామాలు చోటు చెలుకుంటాయో చూడాలి.