Begin typing your search above and press return to search.

బాలీవుడ్ రీఎంట్రీ పై చ‌ర‌ణ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌!

By:  Tupaki Desk   |   20 Aug 2019 2:17 PM GMT
బాలీవుడ్ రీఎంట్రీ పై చ‌ర‌ణ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌!
X
మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ బాలీవుడ్ ఎంట్రీ గురించి తెలిసిందే. బిగ్ బి అమితాబ్ న‌టించిన బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ `జంజీర్` రీమేక్ తో హిందీ ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించాడు. కానీ తొలి ప్ర‌య‌త్నం విఫ‌ల‌మైంది. ఆ త‌ర్వాత మ‌ళ్లీ బాలీవుడ్ మాటే ఎత్త‌లేదు. ఎందుక‌ని అలా దూర‌మ‌య్యారు? తొలి సినిమా వైఫ‌ల్యం బాధ పెట్టి ఇటు రాలేదా? అన్న ముంబై మీడియా ప్ర‌శ్న‌కు చ‌ర‌ణ్ నేడు `సైరా` ఈవెంట్ లో ఆస‌క్తిక‌ర స‌మాధానం ఇచ్చారు.

తొలి ఫ్లాప్ వ‌ల్ల సిగ్గు ప‌డి దూరం కాలేదు. బాలీవుడ్ కి నేను అస‌లు దూరం కాలేదు. స‌రైన క‌థ దొర‌క్క‌పోవ‌డం వ‌ల్ల‌నే హిందీ ప‌రిశ్ర‌మ‌కు దూరంగా ఉన్నాను. స‌రైన క‌థ- ప్రాజెక్టు కుదిరితే న‌టించేవాడిని అని అన్నారు. మ‌రోవైపు టాలీవుడ్ లో బిజీగా ఉండ‌డం వ‌ల్ల‌నే హిందీ ప‌రిశ్ర‌మపై దృష్టి సారించ‌లేక‌పోయాన‌ని తెలిపారు. అభిమానుల‌కు స‌ర్ ప్రైజ్ ఇస్తూ బాలీవుడ్ ఎంట్రీ ఈసారి మిస్ ఫైర్ కాద‌న్న ఆశాభావం వ్య‌క్తం చేశారు.

``రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలోని RRR సినిమాతో బాలీవుడ్ లో తిరిగి అడుగు పెడుతున్నా. ఈ సినిమాతో హిందీ ప్రేక్షకులకు చేరువ అవుతాను. షూటింగ్ దశలో ఉన్నాం`` అని రామ్‌చ‌రణ్ చెప్పారు. ఆర్.ఆర్.ఆర్ 2020 జూలై 30న తెలుగు-త‌మిళం-హిందీలో అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా రిలీజ్ కానుంది. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ పూర్తి చేస్తున్నారు. జంజీర్ ఫెయిలైనా ఆర్.ఆర్.ఆర్ పై మాత్రం చ‌ర‌ణ్ చాలానే ఆశ‌లు పెట్టుకున్నార‌ని దీనిని బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది. ఆర్.ఆర్.ఆర్ చిత్రాన్ని సాహో- సైరా త‌ర‌హాలోనే దాదాపు 300 కోట్ల బ‌డ్జెట్ తో డీవీవీ దాన‌య్య నిర్మిస్తున్నారు.