Begin typing your search above and press return to search.
చెర్రీ మళ్లీ వెజ్జీ అయ్యాడు!
By: Tupaki Desk | 25 May 2016 5:30 PM GMTరామ్ చరణ్ కి తిండి విషయంలో పట్టింపులు ఉండవు. డైటింగుల్లాంటివేమీ చేయకుండా ఏం తినాలనిపిస్తే అది తినేస్తుంటాడు. నాన్ వెజ్ కూడా ఇష్టంగా ఆరగిస్తుంటాడు. అలాంటి చరణ్ ఆమధ్య శాఖహారిగా మారిపోయాడు. అందుకు కారణం తన బ్రాట్. రామ్ చరణ్ కి తన శ్రీమతి ఇచ్చిన కుక్కపిల్ల బ్రాట్ అంటే చాలా ఇష్టం. ఆ కుక్క పిల్లకి ఓ రోజు రోడ్ యాక్సిడెంట్ అయ్యింది. దాంతో విలవిల్లాడిపోయిన చరణ్ బ్రాట్ కోలుకొనే వరకు మాంసాహారం తినకూడదని నిర్ణయించుకొన్నాడు. అలా కొన్నిరోజులపాటు శాఖహారిగానే గడిపాడు. బ్రాట్ కోలుకొన్నాక మళ్లీ ఇష్టమైన మాంసాహారం భుజించాడు. కొన్నేళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ మాంసాహారానికి దూరమయ్యాడు. ఈసారి కారణం మాత్రం బ్రాట్ కాదు. కొత్త చిత్రం ధ్రువ.
ఆ సినిమాలో చరణ్ అథ్లెటిక్ బాడీతో కనిపించాలట. అందుకోసం రకరకాల వ్యాయామాలు చేస్తున్నాడు. నిపుణుల దగ్గర శిక్షణ తీసుకొంటున్నాడు. వారి సలహా మేరకే చరణ్ వెజెటేరియన్గా మారిపోయాడట. అంటే కొన్నాళ్లపాటు దుంపలు, ఆకుకూరలకే పరిమితం అన్నమాట. రామ్ చరణ్ కొన్నాళ్లుగా ధ్రువపైనే కాన్సంట్రేట్ చేశాడు. ఈ సినిమాతో ఎలాగైనా హిట్టు కొట్టాలన్న కసితో ఉన్నాడు. అందుకోసం తన వంతుగా చేయాల్సిందంతా చేస్తున్నాడు.
ఆ సినిమాలో చరణ్ అథ్లెటిక్ బాడీతో కనిపించాలట. అందుకోసం రకరకాల వ్యాయామాలు చేస్తున్నాడు. నిపుణుల దగ్గర శిక్షణ తీసుకొంటున్నాడు. వారి సలహా మేరకే చరణ్ వెజెటేరియన్గా మారిపోయాడట. అంటే కొన్నాళ్లపాటు దుంపలు, ఆకుకూరలకే పరిమితం అన్నమాట. రామ్ చరణ్ కొన్నాళ్లుగా ధ్రువపైనే కాన్సంట్రేట్ చేశాడు. ఈ సినిమాతో ఎలాగైనా హిట్టు కొట్టాలన్న కసితో ఉన్నాడు. అందుకోసం తన వంతుగా చేయాల్సిందంతా చేస్తున్నాడు.