Begin typing your search above and press return to search.

అంతొద్దు.. అసలు చాలు అంటున్న చెర్రీ

By:  Tupaki Desk   |   8 Feb 2016 9:30 AM GMT
అంతొద్దు.. అసలు చాలు అంటున్న చెర్రీ
X
రామ్ చరణ్ తనీ ఒరువన్ రీమేక్ ని ఇంకా ప్రారంభించకపోవడంతో.. బోలెడన్ని రూమర్స్ పుట్టుకొస్తున్నాయి. అసలు ఈ ప్రాజెక్టునే పక్కన పెట్టేశారన్నది ఇందులో అన్నిటికంటే ప్రధానమైనది. కానీ తని ఒరువన్ విషయంలో చెర్రీ గట్టిగానే ఉన్నాడని.. రీమేక్ ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టాలెక్కుతుందని తెలుస్తోంది. అయితే.. ఇంకా ప్రారంభానికి నోచుకోకపోవడానికి కారణం..

మార్పులు చేర్పుల విషయంలో తుది నిర్ణయానికి రాకపోవడమే. రెండు మూడు నెలలు కష్టపడి.. స్క్రిప్ట్ కి కీలకమైన మార్పులు చేశాడు సురేందర్ రెడ్డి అండ్ టీం. అయితే.. వీటిపై చరణ్ శాటిస్ఫై అవలేదని తెలుస్తోంది. తన ఇమేజ్ కి కోసం ఒరిజినల్ లో ఉన్న ఫీల్ చెడిపోయేలా మార్పులు చేసేందుకు చరణ్ ఒప్పుకోవడం లేదని సమాచారం. అందుకే ఇప్పటివరకూ చేసిన మార్పులన్నిటినీ పక్కన పెట్టేసి, ఒరిజినల్ ఎలా ఉంటే అలాగే చేసేద్దామని ఫిక్స్ అయ్యాడు మెగా పవర్ స్టార్. అదే విషయాన్ని డైరెక్టర్ కి చెప్పి, ప్రారంభానికి వీలుగా పనులు చూసుకోమని చెప్పాడట.

స్క్రిప్ట్ ప్రకారం హీరోపై ఎక్కువగా విలన్ దే డామినేషన్ ఉంటుంది. మైండ్ గేమ్ ఆధారంగా ఈ కాన్సెప్ట్ కి పెద్దగా ఛేంజెస్ వద్దంటూ.. చిరు కూడా గతంలోనే చెప్పారు. మరి హీరోని విలన్ డామినేట్ చేసే స్టోరీని మెగా ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. ఇఫ్పటికే ఈ మూవీకోసం రకుల్ ప్రీత్ సింగ్ ని హీరోయిన్ గా ఫైనల్ చేసేశారు. కిక్ 2 ఫ్లాప్ తర్వాత ఎలాగైనా తని ఒరువన్ రీమేక్ తో హిట్ కొట్టాలని.. డైరెక్టర్ సురేందర్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడు.