Begin typing your search above and press return to search.

చెర్రీ అది మిస్ అయిపోతున్నాడట

By:  Tupaki Desk   |   17 March 2018 4:26 AM GMT
చెర్రీ అది మిస్ అయిపోతున్నాడట
X
రామ్ చరణ్ ఇప్పుడు రంగస్థలం మూవీ ప్రమోషన్స్ లో బిజీబిజీగా ఉన్నాడు. రేపు విశాఖ పట్నంలో జరగనున్న రంగస్థలం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఏర్పాట్లలో నిమగ్నం అయిపోయాడు. మరోవైపు తనను ఆప్యాయంగా పిలిచిన వారినీ ఆదరిస్తున్నాడు. రీసెంట్ గా ఓ కంపెనీకి చెందిన ఈవెంట్ జరిగింది. డ్యాన్స్ కాంపిటీషన్స్ లో గెలుపొందిన వారిని అభినందించే పని కూడా పెట్టుకున్నాడు చెర్రీ.

అందరూ చాలా బాగా డ్యాన్స్ చేశారని.. ఆల్మోస్ట్ సినిమాలో తాము వేసిన స్థాయిలో స్టెప్పులు వేశారని.. పాటలు కూడా ఒరిజినల్ రేంజ్ లో పాడారని.. తను తప్పకుండా ఒరిజినల్ లక్ష్మిని మరచిపోతానని అంటూ నవ్వులు పూయించిన రాంచరణ్.. తాను ఈ సినిమా కోసం 365 రోజులు వెచ్చించానని చెప్పుకొచ్చాడు. ఇంత సుదీర్ఘ కాలం ఈ సినిమాకు మాత్రమే వర్క్ చేశానని.. తన కెరీర్ లో బెస్ట్ గా నిలిచిపోయే సత్తా ఈ మూవీకి ఉందన్న చరణ్.. ఎవరినీ డిజప్పాయింట్ చేయకుండా అందరినీ అలరించే సత్తా రంగస్థలంకు ఉందని చెప్పాడు.

ప్రతీ ఒక్కరు ఈ సినిమా చూడాలి అని కోరుకున్న చెర్రీ.. ఈ సినిమా కోసం సుదీర్ఘకాలం తాను గెడ్డం పెంచగా.. రెండు రోజుల క్రితమే తీసేశానని.. ఐ మిస్ మై బియర్డ్ అన్నాడు. అలాగే అందరూ రక్తదానం విషయంలోను.. ఛారిటీ విషయంలోను మరింత ఉదారంగా ఉండాలని కోరుకున్నాడు. 5వేల మంది పని చేసే కంపెనీలో మనిషికి ఓ 100 రూపాయలు విరాళం ఇచ్చినా.. అది 5 లక్షలుగా మారి.. ఎంతో మందికి ఉపయోగపడుతుందని అన్నాడు చరణ్.