Begin typing your search above and press return to search.

గెస్ట్‌ గా మెగా బ్రదర్స్‌ కాదు - బ్రదర్‌ మాత్రమే..!

By:  Tupaki Desk   |   15 Dec 2018 2:22 PM GMT
గెస్ట్‌ గా మెగా బ్రదర్స్‌ కాదు - బ్రదర్‌ మాత్రమే..!
X
వరుణ్‌ తేజ్‌ హీరోగా సంకల్ప్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘అంతరిక్షం’ మూవీ ప్రి రిలీజ్‌ వేడుకలో మెగా బ్రదర్స్‌ చిరంజీవి మరియు పవన్‌ కళ్యాణ్‌ లు పాల్గొనే అవకాశం ఉందని తెగ ప్రచారం జరిగింది. వరుణ్‌ కు మెగా బ్రదర్స్‌ చిరంజీవి, పవన్‌ ల ఆశీస్సులు అందబోతున్నాయని వార్తలు వచ్చాయి. తాజాగా చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ పై ఫుల్‌ క్లారిటీ ఇచ్చారు. చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌ లు రావడం లేదని ఈ వేడుకలో చరణ్‌ మాత్రమే పాల్గొనబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.

భారీ అంచనాలున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుకను ఈనెల 18న నిర్వహించబోతున్నట్లుగా చిత్ర యూనిట్‌ అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం వినయ విధేయ రామ చిత్రం షూటింగ్‌ ను పూర్తి చేసి పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ లో ఉన్న రామ్‌ చరణ్‌ ఈ వేడుకలో పాల్గొనబోతున్నాడు. ఇండియాలోనే మొదటి స్పేస్‌ నేపథ్యం మూవీ అవ్వడంతో ఈ చిత్రంపై తెలుగులోనే కాకుండా అంతటా కూడా అంచనాలు భారీగా ఉన్నాయి.

వరుణ్‌ తేజ్‌ ఈ చిత్రంలో స్పేస్‌ సైంటిస్ట్‌ గా కనిపించబోతున్నాడు. ఘాజీ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న సంకల్ప్‌ రెడ్డి మరోసారి అద్బుతాన్ని ఆవిష్కరించాడని ట్రైలర్‌ చూస్తే అనిపిస్తోంది. అద్బుతమైన విజువల్స్‌ తో ఈ చిత్రంను ఉంటుందని చాలా అంచనాలున్నాయి. ఈనెల 18న చరణ్‌ గెస్ట్‌ గా ప్రీ రిలీజ్‌ వేడుక నిర్వహించి ఆ వెంటనే డిసెంబర్‌ 21న మూవీని విడుదల చేయబోతున్నారు. వరుణ్‌ కు జోడీగా లావణ్య త్రిపాఠి మరియు అదితి రావు హైందరి హీరోయిన్స్‌ గా నటించారు.