Begin typing your search above and press return to search.

కప్పుల కప్పుల సాంబార్ తింటోంది

By:  Tupaki Desk   |   26 July 2017 3:47 PM GMT
కప్పుల కప్పుల సాంబార్ తింటోంది
X
రారాండోయి వేడుక చూద్దాం సినిమాతో విజయం అందుకున్న పంజాబ్ సుందరి రకుల్ ప్రీత్ సింగ్.. ఇంకా పక్కగా సౌత్ అమ్మాయిగా మారిపోవడానికి పూర్తి ఏర్పాట్లు చేసుకుంటోంది. గేర్ మార్చి పెద్ద హీరోలతో సినిమాలు చేస్తే.. ఇప్పుడు స్పైడర్ సినిమాలో మహేశ్ బాబు తో నటిస్తున్న ఈ భామ.. కప్పుల కప్పుల సాంబార్ తాగేస్తోంది తెలుసా? ఇంతకీ ఈ తాగుడు గోల ఏంటనేగా.. పదండి చూద్దాం.

స్పైడర్ సినిమా చేస్తూనే తమిళ్ హీరో కార్తీ సినిమాలో నటిస్తుంది రకుల్. కార్తీ నటిస్తున్న ‘తీరాన్ అతిగారం ఒండ్రు’ పోలీసు డ్రామా సినిమాలో రకుల్ ఒక మాస్ పాత్ర చేస్తోంది. ఈ సినిమాతో పాటుగా మరో స్టార్ హీరో సూర్య సినిమాలో నటించే అవకాశం ఉంది. డైరెక్టర్ సెల్వరాఘవన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా కోసం రకుల్ డేట్స్ అడిగినట్లు తెలుస్తోంది. రకుల్ కూడా ఈ సినిమా చేయడానికి ఇష్టపడుతోందట. దాని కోసం తన డైరీలో ఖాళీలు వెతికి మరి చెప్పబోతుంది అని అంటున్నారు. ఇప్పుడు రకుల్ ఈ రెండు సినిమాలే కాకుండా మరో పెద్ద ప్రాజెక్టులో నటించే అవకాశం రాబోతుంది. మురుగదాస్ డైరెక్ట్ చేస్తున్న తదుపరి సినిమాలో హీరో విజయ్ లీడ్ రోల్ చేయబోతున్నాడు. ఈ కొత్త సినిమా కోసం హీరోయిన్ గా రకుల్ పేరు తెర మీదకు వచ్చింది. ఇంకా ఈ సినిమా పై ఒక నిర్ణయానికి రాకపోయినా మురుగదాస్ సపోర్టుతో ఈ సినిమాలో రకులే నటించే అవకాశం ఉందట.

మొత్తానికి ఏదో ఒక కప్పు సాంబార్ తాగేసి వచ్చేస్తుంది అనుకుంటే.. అమ్మడు అక్కడే ఉండి చాలా సినిమాలు చేస్తూ.. సాంబార్ ల్యాండ్ లో సెటిల్ అయ్యేలా ఉందే. ఇకపోతే త్వరలో అమ్మడు బోయపాటి శ్రీను డైరెక్ట్ చేసిన ‘జయ జానకి నాయక’ సినిమాలో ద్వారా సందడి చేయబోతుంది. ఆగష్టు 11న ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది. అది సంగతి.