Begin typing your search above and press return to search.

చెర్రీ.. మహేష్.. బాగా ఇంపార్టెన్స్ ఇచ్చారు

By:  Tupaki Desk   |   25 Aug 2016 7:30 AM GMT
చెర్రీ.. మహేష్.. బాగా ఇంపార్టెన్స్ ఇచ్చారు
X
ఇప్పుడు టాలీవుడ్ లో అత్యంత బిజీ హీరోయిన్ ఎవరంటే.. రకుల్ ప్రీత్ సింగ్ పేరు మాత్రమే చెప్పాలి. చేతిలో ఒకట్రెండు సినిమాలు ఉంటేనే నేను బాగా బిజ్జీ అని చెప్పేసుకునే రోజుల్లో.. ఒకేసారి అరడజన్ ప్రాజెక్టులు హ్యాండిల్ చేయడానికి సిద్ధమైపోయిందీ హీరోయిన్. అందులోనూ.. అన్నీ స్టార్ హీరోలతో కానీ.. పెద్ద డైరెక్టర్లతో కానీ చేస్తున్నవే కావడం మరీ విశేషం.

అయితే.. లెక్క కోసం అన్ని సినిమాలు ఒప్పేసుకున్నా.. అవన్నీ హీరోయిన్స్ ను పూర్తి స్థాయిలో సంతృప్తిని ఇవ్వలేవని చెప్పాల్సిందే. కానీ ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ టైమ్ చాలా బాగుందట. ఈ విషయాన్ని తనే స్వయంగా సన్నిహితులతో చెప్పేసుకుంటోందని అంటున్నారు. ఇందుకు కారణం.. ఒకేసారి రెండు సినిమాల్లో తన పాత్రకు ఇంపార్టెన్స్ ఉండే రోల్స్ చేయడమేనని తెలుస్తోంది. రామ్ చరణ్ తో చేస్తున్న మూవీ ధృవ లోను.. సూపర్ స్టార్ మహేష్ బాబు- మురగదాస్ కాంబినేషన్ ప్రారంభమైన మూవీలోనూ.. రకుల్ పాత్రకు చాలా స్కోప్ ఉంటుందిట. ఒకేసారి ఇద్దరు స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ.. అది కూడా తనకు పాత్రకు ప్రాధాన్యం ఉండేలా అవకాశం దక్కడం తన అదృష్టంగా చెప్పేసుకుంటోందిట రకుల్ ప్రీత్ సింగ్.

ఇకపోతే ఈ రెండు సినిమాల షూటింగులలోనూ పాల్గొంటున్న రకుల్.. ఆ తరువాత సాయిధరమ్ సినిమాలో నటిస్తోంది. ఆ సినిమా కాకుండా ఇంకా తెలుగులో ఏ పెద్ద స్టార్ తోనూ ఆమె నటించడానికి ఒప్పుకోలేదు. బహుశా ధృవ రిలీజై హిట్టు కొడితే.. రేటు పెంచి సైన్ చేద్దాం అనుకుంటుందేమో.