Begin typing your search above and press return to search.

కూకట్‌ పల్లిలో కూరగాయలమ్ముతా!!

By:  Tupaki Desk   |   6 Feb 2016 4:49 AM GMT
కూకట్‌ పల్లిలో కూరగాయలమ్ముతా!!
X
సమాజ సేవ అంటూ రకరకాల కార్యక్రమాలు చూస్తుంటాం. అలాగే టీవీషోల కోసం కోసం కొన్ని విచిత్రమైన పనులు చేయాల్సి వస్తుంది. ఇప్పుడలాంటి సందర్భమే రకుల్ ప్రీత్ సింగ్ కి ఎదురైంది. టాలీవుడ్ కుర్ర బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ట్విట్టర్ లో పెట్టిన ఓ ట్వీట్.. చాలామందిని ఆకర్షించింది.

హైద్రాబాద్ లో కేపీహెచ్బీలో కూరలు అమ్మనున్నానంటూ రకుల్ చేసిన ట్వీట్ ఫ్యాన్స్ ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. అయితే మొత్తం ట్వీట్ చదివాక అసలు విషయం అర్ధమైంది. 'మంచు లక్ష్మి నిర్వహించనున్న మేము సైతం కార్యక్రమం కోసం మంజీరా మాల్ దగ్గర ఉన్న కేపీహెచ్ బీలో మార్కెట్లో నేను కూరగాయలు అమ్మబోతున్నాను. సమాజాన్ని మార్చే ఓ ప్రోగ్రాం ఇది. రండి ఉదయం 10గంటల నుంచి వచ్చి నా దగ్గర నుంచి కూరలు కొనుక్కోండి' అంటూ ట్వీట్ చేసింది రకుల్ ప్రీత్ సింగ్. థాట్ ఇన్నోవేటివ్ గానే ఉంది కానీ.. మాకు ట్రాఫిక్ జామ్ తప్పదంటూ ఫ్యాన్ చేసిన రీట్వీట్స్ ఫన్నీగానే ఉన్నాయి.

జెమినీ టీవీ నిర్వహిస్తున్న సరికొత్త కార్యక్రమమే మేము సైతం. ఇందుకోసం మంచు లక్ష్మిని హోస్ట్ గా ఎంచుకున్నారు. సెలబ్రిటీలతో రకరకాల కార్యక్రమాలు నిర్వహించి, ఆకట్టుకోనున్నారు. కానీ ఇలా తెరమీద సుందరాంగులను.. కూరగాయల మార్కెట్ కి తీసుకురావడం నిజంగా కొత్త ఐడియానే. మరి ఈ ఆలోచన ఏ మాత్రం సక్సెస్ అవుతుందో చూద్దాం.