Begin typing your search above and press return to search.

చెర్రీతో మళ్లీ నేనే.. కన్ఫామ్‌ చేసింది

By:  Tupaki Desk   |   9 Feb 2016 8:04 AM GMT
చెర్రీతో మళ్లీ నేనే.. కన్ఫామ్‌ చేసింది
X
రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు మంచి హుషారుగా ఉంది. నాన్నకు ప్రేమతో లాంటి బ్లాక్ బస్టర్ సాధించడంతో.. తొలిసారిగా ఈమె భారీ చిత్రంతో విజయాన్ని అందుకుంది. ఇప్పుడు మరో భారీ చిత్రంలో తాను నటించబోతున్నట్లు కన్ఫాం చేసింది రకుల్ ప్రీత్. కోలీవుడ్ మూవీ తనీ ఒరువన్ రీమేక్ కోసం చాలామంది హీరోయిన్స్ పేర్లు వినిపించినా.. రకుల్ ని ఫైనల్ చేశారనే వార్తలొచ్చాయి. అయితే దీనిపై యూనిట్లో ఎవరూ స్పందించలేదు.

కానీ ఇప్పుడు రకుల్ ప్రీత్ మాత్రం తను తనీఒరువన్ రీమేక్ లో నటించబోతున్నట్లు ప్రకటించింది. ఇంకా ఈ ప్రాజెక్ట్ కోసం సైన్ చేయకపోయినా.. తనను సంప్రదించారని.. తను కూడా ఆనందంగా ఒప్పుకున్నానని చెప్పేసింది రకుల్. దీంతో రామ్ చరణ్ మూవీలో వరుసగా రెండోసారి చేసే ఛాన్స్ దక్కించుకున్న హీరోయిన్ గా రకుల్ నిలిచింది. తమిళ్ లో జయం రవి సరసన నయనతార చేసిన రోల్ ను రకుల్ ప్రీత్ చేయనుంది. ఆమె అంతగా కాకపోయినా.. కనీసం నయన్ కు చేరువగా వెళ్లినా చాలు అంటూ తన సింప్లిసిటీని వెల్లడించింది రకుల్. అలాగే మెగా పవర్ స్టార్ సరసన రెండోసారి ఛాన్స్ రావడంపై కూడా స్పందించింది ఈ భామ.

ఏ ఆర్టిస్టు పక్కన అయినా సరే.. రెండో ఛాన్స్ కోసం అడిగారంటే.. అది చేసిన కృషికి, పడిన కష్టానికి గుర్తింపు అని చెప్పింది రకుల్. అలాగే తని ఒరువన్ రీమేక్ త్వరలో షూటింగ్ ప్రారంభం కానుండగా.. తాను మార్చ్ చివర్లో కానీ, ఏప్రిల్ మొదట్లో కానీ యూనిట్ తో కలుస్తానని చెప్పిందీ పంజాబీ సుందరి.