Begin typing your search above and press return to search.

వ్రతం పట్టిన రాజమౌళి ఫ్యామిలీ

By:  Tupaki Desk   |   26 Aug 2015 2:00 PM GMT
వ్రతం పట్టిన రాజమౌళి ఫ్యామిలీ
X
సక్సెస్ సాధించడం కంటే దాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం. కానీ రాజమౌళి దశాబ్దంన్నరగా విజయవంతంగా ఈ ఒరవడిని కొనసాగిస్తున్నాడు. ఐతే ప్రతిసారీ అంత సులభంగా ఏమీ విజయం రాజమౌళి ఒళ్లో వచ్చి వాలిపోవట్లేదు. దానికి అతను పడుతున్న కష్టం సామాన్య ప్రేక్షకులకు ఎరుకే. ఒక హిట్టు తర్వాత తన మీద ఏర్పడే అంచనాల్ని అందుకోవడానికి మరింతగా కష్టపడతాడన్న సంగతి తెలిసిందే. అతనెంచుకున్న సబ్జెక్టులు వాటిని తెరకెక్కించడానికి అతను చేసే ప్రయత్నాన్ని బట్టే.. ప్రేక్షకుల విషయంలో రాజమౌళి ఎంత రెస్పాన్సిబుల్ గా ఉంటాడో.. వారిని మెప్పించడానికి ఎంత కష్టపడతాడో అర్థమైపోతుంది. సినిమా సినిమాకూ కొన్ని మెట్లు ఎక్కుతూ వచ్చిన జక్కన్న.. ‘బాహుబలి’తో ఇండియన్ సినిమా శిఖరాలను తాకాడు. ఇప్పుడతడి అభిమానులు దేశవ్యాప్తంగా ఉన్నారు. వాళ్లందరిలో ‘బాహుబలి-2’ మీద అంచనాల గురించి చెప్పాల్సిన పని లేదు.

మరి ఈ అంచనాల్ని అందుకోవడం అంటే చిన్న విషయమా? అందుకే రాజమౌళి ఫ్యామిలీ అంతా కొన్ని రోజుల నుంచి వ్రతం పట్టింది. బాహుబలి-2 స్క్రిప్టు ఇంతకుముందే పూర్తయింది కానీ.. తొలి భాగానికి వచ్చిన స్పందన చూశాక రెండో భాగం విషయంలో జక్కన్న అండ్ కో మీద అంచనాలు చాలా పెరిగిపోయాయి. వారి మీద చాలా బాధ్యత ఉంది. అందుకే మళ్లీ స్క్రిప్టు మీద కూర్చుంది బాహుబలి టీమ్. రాజమౌళి, విజయేంద్ర ప్రసాద్, కీరవాణి, రమ రాజమౌళి, ఎస్.ఎస్.కాంచిలతో పాటు బాహుబలి ఫస్ట్ పార్ట్ లో పాలుపంచుకున్న రచయితలు అందరూ కలిసి.. స్క్రిప్టును మరింత బాగా తీర్చిదిద్దే ప్రయత్నంలో ఉన్నారు. గత రెండు మూడు వారాలుగా ఈ కసరత్తు జరుగుతోంది. మొత్తం నెల రోజులు స్క్రిప్టుకు మెరుగు దిద్దే పనులు జరుగుతాయి. అంతా ఓకే అనుకున్నాకే షూటింగుకు వెళ్తారు. కొంచెం ఆలస్యమైనా పర్వాలేదు కానీ.. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా వచ్చేలా చూసుకోవాలని పట్టుదలతో ఉంది జక్కన్న అండ్ టీమ్.