Begin typing your search above and press return to search.

'మౌనముని' మాట్లాడితే అంతే

By:  Tupaki Desk   |   18 Sep 2019 4:30 AM GMT
మౌనముని మాట్లాడితే అంతే
X
ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించి వేదికలపై తక్కువ మాట్లాడే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కి మౌనముని అనే బిరుదు ఉన్న సంగతి తెలిసిందే. అప్పటి వరకూ దర్శకేంద్రుడు మాట్లాడటం చూడని వారందరికీ ఈటీవిలో వచ్చిన ఓ షో ఈ మౌనముని మాటలను వినిపించింది. ఇక అక్కడి నుంచి రాఘవేంద్రరావు ఏదైనా సినిమా ఈవెంట్ కి వచ్చిన ప్రతీ సారి చమత్కారం తో రొమాంటిక్ యాంగిల్ లో మాట్లాడుతూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. కొన్నిసార్లు శృతి మించిపోతున్నాడు కూడా.

నిన్న జరిగిన 'వాల్మీకి' ప్రెస్ మీట్ లో మౌనముని మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వేదికపై 'ఎల్లువొచ్చి' పాట గురించి మాట్లాడి తన మధురస్మృతులు గుర్తుచేసుకున్న దర్శకేంద్రుడు చివర్లో పూజా హెగ్డే నడుముపై పెట్టుకున్న బిందె కావాలంటూ ఆ బిందెను తనకి గిఫ్ట్ గా ఇవ్వాలని కోరాడు. దాంతో అందరూ మౌనముని చిలిపితనం చూసి నవ్వుకున్నారు. ఇక రాఘవేంద్రరావు రొమాంటిక్ టాక్ వింటూ హరీష్ శంకర్ కూడా లైన్ లోకి వచ్చి గురువు గారు ఇప్పుడు పూజా ని చూస్తే మీకు ఏ పండుతో కొట్టాలనిపిస్తుంది ? అంటూ సరదాగా అడిగాడు. ఇక అనుమానం లేకుండా చెర్రీ అయితే బాగుంటుంది అంటూ జవాబిచ్చారు మౌనముని.

చివర్లో పూజా బిందేపై ముద్దు పెట్టి ఇస్తే దాన్ని కానుకగా స్వీకరించారు. అక్కడ ఉన్నవారు ఇదంతా చూసి మౌనముని మాట్లాడితే ఇంతే... హీరోయిన్ పక్కన ఉంటే ఆయన మరీ రెచ్చిపోతారు అనుకున్నారు. నిజానికి వేదికలపై హీరోయిన్స్ గురించి రొమాంటిక్ గా మాట్లాడటం అనే కేటగిరీలో చలపతి రావు, అలీ ఉంటారు. ఇప్పుడు రాఘవేంద్రరావు గారు కూడా ఆ లిస్టులో చేరినట్టు కనిపిస్తుంది.