Begin typing your search above and press return to search.
RRR లో షాడో ఇన్వెస్టర్
By: Tupaki Desk | 18 Dec 2018 10:03 AM GMTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్- యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకులుగా రాజమౌళి RRR తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. డి..వి.వి ఎంటర్ టైన్ మెంట్స్ పతాకం పై దానయ్య ప్రతిష్టాత్మకం గా రూ.300కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. రాజీ కి వచ్చే ప్రసక్తే లేకుండా జక్కన్న కు కావాల్సినవన్నీ ఏర్పాటు చేస్తున్నారు నిర్మాత. ఇప్పటికే తొలి షెడ్యూల్ పూర్తయింది. రెండో షెడ్యూల్ ఫిబ్రవరి నుంచి మొదలు కానుంది. తాజా గా సినిమా కు సంబంధించి ఓ ఆసక్తిర విషయం లీకైంది. RRR లో హీరో రామ్ చరణ్ కూడా పెట్టుబడి పెడుతున్నారట. అది తనకు రావాల్సిన పారితోషికాన్నే ఇన్వెస్టిమెంట్ గా మార్చారని సమాచారం. ప్రస్తుతం చరణ్ .. బోయపాటి శ్రీను దర్శకత్వంలో `వినయ విధేయ రామ`లో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది కూడా దానయ్య. వరుసగా రెండు సినిమాల పారితోషికాలు RRRకి పెట్టుబడిగా చరణ్ ఇస్తున్నారట.
ప్రస్తుతం చరణ్ కు క్రేజ్ దృష్ట్యా 18 నుంచి 20 కోట్లు పారితోషికం తీసుకుంటున్నాడు. `రంగస్థలం` చిత్రం ఘనవిజయం తో క్రేజ్ పెరిగిన నేపథ్యంలో దానయ్య ఒక్కో ప్రాజెక్టుకు 20 కోట్లకు డీల్ మాట్లాడుకున్నాడుట. అయితే ఆ డబ్బును చరణ్ తనకు ఇవ్వొద్దని, అలాగే RRR కి వచ్చే పారితోషికాన్ని కూడా సినిమాలోనే ఇన్వెస్ట్ చేయండని... సినిమా హిట్ అయితే వచ్చిన లాభాల్లో పర్సంటేజ్ తీసుకుంటానని చెప్పారట. దానయ్య కు కూడా ఇన్వెస్టర్ అవసరం అవ్వడం తో ఒకే చెప్పినట్లు సమాచారం. చరణ్ సినిమా బడ్జెట్ తగ్గించాలని కొన్నాళ్లుగా అనుకుంటున్నాడు. సినిమా బడ్జెట్ రోజు రోజు కి పెరిగిపోవడం అనేది నిర్మాత ను రిస్క్ జోన్ లో కి వెళ్లినట్లేనని... ఏ సినిమాకైనా బడ్జెట్ కంట్రోలింగ్ తప్పనిసరని పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే.
అందుకే దానయ్య కు కాస్త సపోర్ట్ గా కూడా ఉంటుందనే పారితోషికం తీసుకోకుండా RRR లో స్లీపింగ్ ప్రొడ్యూసర్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చరణ్ `వినయ విధేయ రామ` లో తస్సాదియ్యా అనే ఐటం సాంగ్ షూట్ లో బిజీగా ఉన్నాడు. అన్నపూర్ణ స్టూడియో లో ప్రత్యేకంగా నిర్మించిన సెట్ లో షూట్ చేస్తున్నారు. ఇందులో బాలీవుడ్ నటి ఈషా గుప్తా ఐటెమ్ గాళ్ గా కనిపించనుంది. సంక్రాంతి కానుకగా చిత్రాన్ని జనవరి 11న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.
ప్రస్తుతం చరణ్ కు క్రేజ్ దృష్ట్యా 18 నుంచి 20 కోట్లు పారితోషికం తీసుకుంటున్నాడు. `రంగస్థలం` చిత్రం ఘనవిజయం తో క్రేజ్ పెరిగిన నేపథ్యంలో దానయ్య ఒక్కో ప్రాజెక్టుకు 20 కోట్లకు డీల్ మాట్లాడుకున్నాడుట. అయితే ఆ డబ్బును చరణ్ తనకు ఇవ్వొద్దని, అలాగే RRR కి వచ్చే పారితోషికాన్ని కూడా సినిమాలోనే ఇన్వెస్ట్ చేయండని... సినిమా హిట్ అయితే వచ్చిన లాభాల్లో పర్సంటేజ్ తీసుకుంటానని చెప్పారట. దానయ్య కు కూడా ఇన్వెస్టర్ అవసరం అవ్వడం తో ఒకే చెప్పినట్లు సమాచారం. చరణ్ సినిమా బడ్జెట్ తగ్గించాలని కొన్నాళ్లుగా అనుకుంటున్నాడు. సినిమా బడ్జెట్ రోజు రోజు కి పెరిగిపోవడం అనేది నిర్మాత ను రిస్క్ జోన్ లో కి వెళ్లినట్లేనని... ఏ సినిమాకైనా బడ్జెట్ కంట్రోలింగ్ తప్పనిసరని పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే.
అందుకే దానయ్య కు కాస్త సపోర్ట్ గా కూడా ఉంటుందనే పారితోషికం తీసుకోకుండా RRR లో స్లీపింగ్ ప్రొడ్యూసర్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చరణ్ `వినయ విధేయ రామ` లో తస్సాదియ్యా అనే ఐటం సాంగ్ షూట్ లో బిజీగా ఉన్నాడు. అన్నపూర్ణ స్టూడియో లో ప్రత్యేకంగా నిర్మించిన సెట్ లో షూట్ చేస్తున్నారు. ఇందులో బాలీవుడ్ నటి ఈషా గుప్తా ఐటెమ్ గాళ్ గా కనిపించనుంది. సంక్రాంతి కానుకగా చిత్రాన్ని జనవరి 11న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.