Begin typing your search above and press return to search.

పూరీ.. వాళ్లకు సారీ చెప్పేశాడు

By:  Tupaki Desk   |   25 May 2016 5:15 AM GMT
పూరీ.. వాళ్లకు సారీ చెప్పేశాడు
X
లోఫర్ మూవీకి సంబంధించి డిస్ట్రిబ్యూటర్లపై దర్శకుడు పూరీ జగన్నాథ్ పోలీసు కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడీ వివాదం కీలక దశకు చేరుకుని, మరో టర్న్ తీసుకుంది. అభిషేక్ నామా - రామ్ దాస్ నాయుడు - కాళి సుధీర్ లు తనను బెదిరిస్తున్నారంటూ.. పోలీసులకు ఇచ్చిన కంప్లెయింట్ ను పూరి జగన్నాధ్ ఉపసంహరించుకున్నాడు.

'అభిషేక్ - రామ్ దాస్ నాయుడులకు క్షమాపణలు చెప్పిన పూరీ జగన్నాథ్.. కేసును కూడా వాపసు కూడా తీసుకున్నాడు. ఈ వివాదం జరిగిన సమయంలో కాళి సుధీర్ అసలు ఆ ప్రదేశంలోనే లేడు. ఆ సమయంలో సుధీర్ టూర్ లో ఉన్నాడు' అని అభిషేక్ సన్నిహితులు చెబుతున్నారు. ఇప్పుడు సారీ చెప్పి మరీ పూరీ కేసు విత్ డ్రా చేసుకున్నా వివాదం సమసిపోయేట్లుగా కనిపించడం లేదు.

తనపై తప్పుడు కేసు పెట్టి కేసు తన పరువు తీశాడంటూ.. పూరీ జగన్నాథ్ పై పరువు నష్టం దావా వేసేందుకు సుధీర్ రెడీ అవుతున్నాడట. ఈ విషయంలో డిస్ట్రిబ్యూటర్లు పైకి ఏమీ చెప్పకపోయినా తెరవెనుక ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుస్తోంది. అయితే.. ఇండస్ట్రీ పెద్దలు మాత్రం దీనికి కూడా చర్చలతోనే పరిష్కారం లభించేలా ప్రయత్నిస్తున్నారు.