Begin typing your search above and press return to search.

బిగ్‌ బాస్‌ కు బుద్ధి లేదు..కంటెస్టెంట్ల ఎదురుదాడి!

By:  Tupaki Desk   |   12 Sep 2019 4:25 AM GMT
బిగ్‌ బాస్‌ కు బుద్ధి లేదు..కంటెస్టెంట్ల ఎదురుదాడి!
X
బిగ్ బాస్ పై పునర్నవి తిట్ల వర్షం ఆగేలా కనిపించడం లేదు. మంగళవారం ఎపిసోడ్ లో ఇంట్లో దెయ్యం నాకేం భయం టాస్క్ లో భాగంగా ఇంటి సభ్యులు తనను ఈడ్చుకెళ్లి స్విమ్మింగ్ ఫూల్‌ లో పడేయడాన్ని తప్పుపడుతూ.. ఇలాంటి బుల్ షిట్ గేమ్‌ లు ఇవ్వొద్దు అంటూ పున్నూ బిగ్ బాస్‌ కే వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ టాస్క్ బుధవారం ఎపిసోడ్ కూడా కొనసాగడంతో పున్నూ గేమ్ ఆడకుండా బిగ్ బాస్ పై ఫైర్ అయింది. బిగ్‌ బాస్ కు బుద్ధి లేదని - ముష్ఠి గేమ్స్ ఇస్తూ ఇబ్బంది పెడుతున్నారని తిట్టిన తిట్టకుండా తిట్టేసింది.

ఇక టాస్క్‌ లో భాగంగా మంగళవారం ఎపిసోడ్ లో దెయ్యాలుగా ఉన్న హిమజ - వితిక - శిల్పలు వరుసగా టాస్కుల ద్వారా శ్రీముఖి - వరుణ్ - పునర్నవి లని చంపేసి మనుషులుగా మారిన విషయం తెలిసిందే. ఇక వారి చేతిలో చనిపోయిన శ్రీముఖి - వరుణ్ - పునర్నవి లు దెయ్యాలుగా మారిపోయారు. అయితే బుధవారం ఎపిసోడ్ లో పునర్నవి దెయ్యం డ్రెస్ వేసుకున్నా టాస్క్ మాత్రం చేయనని కూర్చుంది. ఈ క్రమంలోనే రాహుల్-పునర్నవి మధ్య పెద్ద చర్చ నడిచింది.

‘నన్ను పట్టించుకోవట్లేదని’రాహుల్ పున్నూతో అనడంతో టాపిక్ మొదలైంది. అందరూ మన ఇద్దరి మధ్య ఏదో జరుగుతుందని అనుకుంటున్నారని అందుకే దూరంగా ఉంటున్నాని పునర్నవి చెప్పుకొచ్చింది. అంతే గానీ నిన్ను పట్టించుకోవట్లేదని అనుకోవద్దని చెప్పింది. ఇక ‘నువ్ నా పట్ల కేర్ చూపిస్తే ఏదో ఉందని అనుకుంటారని - దాంట్లో తప్పు ఏం ఉందని - అయిన నీ వల్ల నా మైండ్ పోతుందని రాహుల్ చెప్పాడు. అలా అలా వీరి మధ్య గొడవ పెరగడంతో రాహుల్ సారీ చెప్పి గొడవకు ఫుల్ స్టాప్ పెట్టాడు.

వీరి చర్చ తర్వాత ఈ టాస్క్ లో రెండో భాగంగా బుధవారం బాబా భాస్కర్ టాస్క్ ద్వారా రవిని చంపేసి మనిషిగా మారిపోగా - రాహుల్ మహేశ్ ని చంపేసి మనిషిగా మారిపోయాడు. రవి - మహేశ్ దెయ్యాలుగా మారిపోయారు.