Begin typing your search above and press return to search.

అడ్డంగా బుక్కై పోయిన కమెడియన్

By:  Tupaki Desk   |   18 July 2018 5:35 AM GMT
అడ్డంగా బుక్కై పోయిన కమెడియన్
X
తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచుతుడు అయిన తమిళ కమెడియన్ వడివేలు ఇప్పుడు సమస్యల సుడిగుండంలో చిక్కుకుని అల్లాడిపోతున్నాడు. అఫ్ కోర్స్ ఇది స్వయంకృతాపరాధమే లేండి.వడివేలు మూడేళ్ళ క్రితం ఈల్ అనే సినిమా ఒకటి తనే హీరోగా చేసాడు. జయం ఫేమ్ సదా అందులో హీరోయిన్. అది డిజాస్టర్ అయ్యింది. వారం రోజులు థియేటర్లో నిలపడం తలకు మించిన భారం అనిపించింది. ఆ సినిమా నిర్మాత సతీష్ కుమార్. నిర్మాణ సమయంలో బడ్జెట్ పెరిగిపోవడంతో రామ్ కుమార్ అనే వ్యక్తి దగ్గర కోటిన్నర అప్పు చేసాడు. నిర్ణీత వ్యవధి దాటాక వడ్డీతో కలిపి రెండు కోట్లు చెల్లించేలా అగ్రిమెంట్ రాసుకున్నారు. దానికి వడివేలు ష్యురిటీ సంతకం పెట్టాడు. సినిమా పోయింది. వడ్డీ కాదు కదా అసలులో సగం కూడా సతీష్ కు రాలేదు. దీంతో చేతులు ఎత్తేసాడు. ఇప్పుడు రామ్ కుమార్ సతీష్ తో పాటు హమీదారుగా ఉన్నందుకు వడివేలు పీకపై కత్తి పెట్టుకుని కూర్చున్నాడు.

ఇదిలా ఉండగా దర్శకుడు శంకర్ నిర్మిస్తున్న హింసించే 23వ రాజు పులికేశి సీక్వెల్ షూటింగ్ కు సహకరించకుండా ఇబ్బంది పెడుతున్నాడన్న కేసు వడివేలు మీద ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో నానుతూనే ఉంది. వ్యక్తిగత స్టాఫ్ కి సంబందించిన విషయంతో పాటు కథలో తాను కోరిన మార్పులు చేయలేదనే కోపంతోనే వడివేలు కావాలనే హ్యాండ్ ఇచ్చాడని శంకర్ సమాఖ్యకు ఆరోపించాడు. దీన్ని విచారించిన ప్రొడ్యూసర్ కౌన్సిల్ షూటింగ్ అయినా పూర్తి చేయమని లేదా ఇప్పటిదాకా ఖర్చైన 9 కోట్లయినా తిరిగి ఇచ్చేయమని చెప్పింది. వడివేలు రెండూ చేయటం లేదు. ఇప్పటికే శంకర్ దీని వల్ల బాగా నష్టపోయాడు. ఈ సినిమా దర్శకుడు శింబు దేవన్ కూడా వడివేలు మీద భగ్గుమంటున్నాడు. అయినా ఇన్ని వివాదాలు చుట్టుకున్న వడివేలు మాత్రం దిట్టంగా ఉన్నాడు. గతంలో రజనీకాంత్ మీద తీవ్ర వ్యాఖ్యలు చేసి వివాదం చేసిన వడివేలు ఇటీవలే విజయ్ అదిరింది సినిమాలో చెప్పుకోదగ్గ పాత్రే దక్కించుకున్నాడు. అన్ని సెట్ అవుతున్న సమయంలో మళ్ళి ఇలా సమస్యల్లో ఇరుక్కున్నాడు .