Begin typing your search above and press return to search.

ప్రియ‌మ‌ణి ఈ రోజు ఏం చేసిందో తెలుసా?

By:  Tupaki Desk   |   28 May 2016 4:25 PM GMT
ప్రియ‌మ‌ణి ఈ రోజు ఏం చేసిందో తెలుసా?
X
సినిమాల‌కు చెల్లుచీటీ ఇచ్చేసిన ప్రియ‌మ‌ణి ఇప్పుడేం చేయ‌గ‌ల‌దు. పెళ్లి చేసుకుని సెటిల‌వ్వ‌డం త‌ప్ప‌. ఆమె ఆ దిశ‌గానే అడుగులేసింది. మూడేళ్లుగా ప్రేమిస్తున్న ప్రియుడు ముస్త‌ఫా రాజ్ తో ఈ రోజు చ‌డీచ‌ప్పుడు లేకుండా నిశ్చితార్థం చేసుకుంది డ‌స్కీ బ్యూటీ. బెంగళూరులోని బనశంకరిలోని త‌న‌ స్వగృహంలో కుటుంబసభ్యుల మధ్య ముస్తఫా రాజ్‌తో నిశ్చితార్థం చేసుకుంది ప్రియ‌మ‌ణి. తామిద్దరం చాలా కాలం నుంచి ప్రేమించుకుంటున్నామని.. త్వరలో ఆడంబరాలేమీ లేకుండా సింపుల్ గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోనున్నట్లు ప్రియ‌మ‌ణి చెప్పింది.

చెన్నైకి చెందిన బిజినెస్ మేన్ అయిన ముస్త‌ఫారాజ్ క‌న్న‌డ‌లో కొన్ని సినిమాల ప్రొడ‌క్ష‌న్ చూశాడు. ఆ సంద‌ర్భంగా ప్రియ‌మ‌ణితో ప‌రిచ‌యం ఏర్ప‌డి.. ప్రేమ‌కు దారి తీసింది. ముస్త‌ఫాతో ప్రేమాయ‌ణం గురించి బ‌య‌టికి చెప్ప‌డానికి ప్రియ‌మ‌ణి పెద్ద‌గా మొహ‌మాట ప‌డ‌లేదు. దీని వ‌ల్ల ఆమె సినీ కెరీర్ కూడా దెబ్బ తింది. తానిక సినిమాల‌కు అందుబాటులో ఉండేమో అని త‌న‌కు నిర్మాతలు అవ‌కాశాలివ్వ‌లేద‌ని ఈ మ‌ధ్యే వాపోయిన ప్రియ‌మ‌ణి ఇక లాభం లేద‌ని పెళ్లి పీట‌లెక్కేయ‌డానికి సిద్ధ‌మైపోయింది. ప‌రుత్తి వీర‌న్ సినిమాతో జాతీయ అవార్డు సాధించిన ఈ మ‌ల‌యాళ బ్యూటీ ద‌క్షిణాదిన అన్ని భాష‌ల్లోనూ న‌టించింది. హిందీలోనూ త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకుంది.