Begin typing your search above and press return to search.

సొట్ట బుగ్గల సుందరికి జెట్ ఎయిర్ వేస్ షాక్

By:  Tupaki Desk   |   21 Oct 2016 6:05 AM GMT
సొట్ట బుగ్గల సుందరికి జెట్ ఎయిర్ వేస్ షాక్
X
సొట్టబుగ్గల సుందరి ప్రీతి జింటాకు కోపం వచ్చేసింది. జెట్ ఎయిర్ వేస్ తనను తీవ్రంగా అవమానించిందని ఆమె ఆరోపిస్తోంది. ఢిల్లీ నుంచి ముంబయి వెళ్లాల్సిన ఆమె.. జెట్ ఎయిర్ వేస్ టికెట్ కొనుగోలు చేశారు. ఆమె ప్రయాణించాల్సిన విమానం గంటన్నర ఆలస్యం కావటంతో ఆమెకు ఒక గెస్ట్ రూం కేటాయించారు. ఇక్కడ వరకూ బాగానే ఉన్నా.. అసలు సమస్యంతా ఆ తర్వాత మొదలైంది.

విమానం ఆలస్యమైన కారణంగా కేటాయించిన గెస్ట్ రూంలో ప్రీతిజింటా ఉండగా.. ఆమెకు చెప్పకుండానే విమానం వెళ్లిపోయింది. ఆ విషయాన్ని తెలుసుకున్న ప్రీతి షాక్ తిన్నారు. తమ గెస్ట్ రూపంలో వెయిట్ చేస్తున్న అతిధిని వదిలేసి మరీ విమానాన్ని ఎలా పంపిస్తారంటూ ఆమె ఫైర్ అయ్యరు. తన ఆగ్రహాన్ని ట్విట్టర్ లో అందరికి పంచుకున్నారు. జెట్ ఎయిర్ వేస్ గంటన్నర ఆలస్యంగా విమానం నడుపుతోందని.. బోర్డింగ్ విషయాన్ని తనకు చెప్పకుండానే టేకాఫ్ చేశారని.. ఆలస్యంగా విమానం వచ్చినందుకు.. తాను ఫ్లైట్ మిస్ అయ్యేలా చేసినందుకు ఇకపై ఎప్పుడూ జెట్ ఎయిర్ వేస్ విమానం ఎక్కనంటే ఎక్కనని తేల్చేశారు. ఈ సందర్భంగా ‘థ్యాంక్యూ జెట్ ఎయిర్ వేస్’ అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

ప్రీతిజింటా ఆగ్రహంపై జెట్ ఎయిర్ వేస్ రియాక్ట్ అయ్యింది. ప్రీతిజింటాకు విమానం మిస్ కావటంలో తమ తప్పు లేదని.. బోర్డింగ్ సమాచారాన్నిఆమెకు అందించామని.. అయితే.. ఆమె వేరే పార్సిల్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారని జెట్ ఎయిర్ వేస్ పేర్కొంది. ఆమె ప్రయాణించాల్సిన విమానం టేకాఫ్ అవుతుందని చెప్పినా.. ప్రీతి వినలేదని చెప్పిన జెట్ ఎయిర్ వేస్.. తర్వాత ఆమెకు వేరే విమానం ఏర్పాటు చేస్తామని చెప్పినా అందుకు అంగీకరించలేదని పేర్కొనటం గమనార్హం.