Begin typing your search above and press return to search.

కేజీఎఫ్ డైరెక్ట‌ర్ తో ఎన్టీఆర్ మైత్రి ఫిక్స్

By:  Tupaki Desk   |   11 July 2019 5:30 PM GMT
కేజీఎఫ్ డైరెక్ట‌ర్ తో ఎన్టీఆర్ మైత్రి ఫిక్స్
X
`కేజీఎఫ్` లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రంతో ఇండ‌స్ట్రీ టాప్‌ హీరోల దృష్టిని ఆక‌ర్షించారు క‌న్న‌డ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్. ఆ ఒక్క సినిమాతో అత‌డిలోని స్టామినా ఎంతో ప్ర‌పంచానికి అర్థ‌మైంది. కోలార్ బంగారు గ‌నుల నేప‌థ్యంలోని హిస్టారిక‌ల్ మాఫియా స్టోరిని ఎంచుకుని అత్యంత భారీ కాన్వాసు మీద అత‌డు తెర‌కెక్కించిన విధానం క్రిటిక్స్ కే మ‌తి చెడేలా చేసింది. కేజీఎఫ్ చూశాక మ‌హేష్ - ప్ర‌భాస్- ఎన్టీఆర్ - రామ్ చ‌ర‌ణ్- అల్లు అర్జున్ లాంటి హీరోలే ప్ర‌శాంత్ నీల్ ప్ర‌తిభ‌ను కొనియాడారు. అత‌డితో క‌లిసి ప‌ని చేసేందుకు ఆస‌క్తిని క‌న‌బ‌రిచార‌ని వార్త‌లొచ్చాయి. ఇండ‌స్ట్రీ అగ్ర బ్యాన‌ర్ల‌న్నీ అత‌డి కోసం క్యూలో ఉన్నాయ‌ని ప్ర‌చార‌మైంది.

ప్ర‌భాస్ - ప్ర‌శాంత్ నీల్ కాంబినేష‌న్ లో యు.వి.క్రియేష‌న్స్ ఓ మూవీని ప్లాన్ చేసింద‌ని ఇదివ‌ర‌కూ వార్త‌లొచ్చాయి. అలాగే మైత్రి మూవీ మేక‌ర్స్ సైతం కేజీఎఫ్ డైరెక్ట‌ర్ తో ప్లాన్ చేస్తోంద‌ని లీకులు అందాయి. తాజాగా ఇదే విష‌యంపై మైత్రి సంస్థ అధినేత‌ల్లో ఒక‌రైన న‌వీన్ ఎర్నేని ఫుల్ క్లారిటీనిచ్చేశారు. ఎన్టీఆర్ - కేజీఎఫ్ డైరెక్ట‌ర్ కాంబినేష‌న్ మూవీని అధికారికంగా క‌న్ ఫామ్ చేశారు.

``కేజీఎఫ్ డైరెక్ట‌ర్ తో ఎన్టీఆర్ మూవీ ప్రాసెస్ లో ఉంది. ఎన్టీఆర్ కి కేజీఎఫ్ సినిమా ఎంతో న‌చ్చింది. ప్ర‌శాంత్ నీల్ పేరును ఎన్టీఆర్ స్వ‌యంగా సూచించారు. త‌న‌వ‌ద్ద‌ మంచి క‌థ‌ ఉంటే చేద్దామ‌ని అన్నారు. ఈ ప్రాజెక్ట్ ప్రాసెస్ లో ఉంది`` అని న‌వీన్ తెలిపారు. ``ఎన్టీఆర్ న‌టిస్తున్న ఆర్.ఆర్.ఆర్ పూర్త‌వ్వాలి. అలాగే ప్ర‌శాంత్ నీల్ కేజీఎఫ్ సీక్వెల్ పూర్తి చేయాల్సి ఉంటుంది. అందుకు ఇంకా చాలా స‌మ‌యం ప‌డుతుంది. ఆ త‌ర్వాత ప్ర‌ణాళిక‌లో వేగం పెంచుతా``మ‌ని ఆయ‌న వెల్ల‌డించారు. విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా మైత్రి సంస్థ నిర్మించిన `డియ‌ర్ కామ్రేడ్` ఈనెల 26న రిలీజ‌వుతున్న సంద‌ర్భంగా ఓ ఇంట‌ర్వ్యూలో న‌వీన్ ఎర్నేని పై సంగ‌తుల్ని ముచ్చ‌టించారు. ఎన్టీఆర్ తో కేజీఎఫ్ డైరెక్ట‌ర్ మూవీ అంటే దానికి జాతీయ స్థాయిలో మైలేజ్ ఉంటుద‌న‌డంలో సందేహం లేదు. బ‌హుశా తార‌క్ కి అదే బెస్ట్ బాలీవుడ్ డెబ్యూ అవుతుందేమో?