Begin typing your search above and press return to search.

పద్మావతిని నరుకుతారా? జిఎస్స్టీ కట్ చేస్తారా?

By:  Tupaki Desk   |   20 Nov 2017 7:03 AM GMT
పద్మావతిని నరుకుతారా? జిఎస్స్టీ కట్ చేస్తారా?
X
బాలీవుడ్ లో పద్మావతి సినిమా వలన వాతావరణం ప్రస్తుతం తుపానును తలపిస్తోంది. సైక్లోన్స్ లాంటి వార్నింగ్ లు రోజుకొకటి వస్తున్నాయి. దీంతో బాలీవుడ్ మొత్తం ఈ సమస్య పై ఎటు తేల్చుకోలేని పరిస్థితి. పద్మావతి షూటింగ్ మొదలుపెట్టినప్పటి నుండే వివాదాలు తార స్థాయికి చేరాయి. మళ్లీ తగ్గిపోతుందిలే అని అందరు అనుకున్నారు. కానీ అది ఇప్పుడు చాలా సీరియస్ అయ్యింది.

మొన్న ఒక వ్యక్తి హీరోయిన్ - డైరెక్టర్స్ తలలను నరికేస్తే రూ.5 కోట్లు ఇస్తామని చెప్పాడు. ఇక రీసెంట్ గా మరొక వ్యక్తి ఏకంగా రూ.10 కోట్లను ఇస్తామని చెప్పాడు. అతను ఎవరో కాదు హర్యానా బీజేపీ చీఫ్ మీడియా కో-ఆర్డినేటర్ సూరజ్ పాల్. దీపిక-సంజయ్‌ ల తలలను నరికేస్తే రూ.10కోట్ల నజరానా ఇస్తామని చెప్పాడు. అంతే కాకుండా వారి కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పారు. దీంతో బాలీవుడ్ తారలు ఈ విషయంపై చాలా సీరియస్ అవుతున్నారు.

రీసెంట్ గా విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కూడా మరోసారి తనదైన శైలిలో సోషల్ మీడియా ద్వారా కామెంట్ చేశాడు. ఫైనల్ గా ఎలక్షన్స్ తర్వాత సినిమా రిలీజ్ కాబోతోంది. అంటూ.. డైరెక్టర్ - యాక్టర్ శిరచ్చేదనంకు మొన్న ఒకరు రూ.5 కోట్లు ప్రకటిస్తే ఈ రోజు మరొకరు రూ.10 కోట్లు ఇస్తామని అంటున్నారు. రోజు రోజుకి రివార్డ్ మనీ పెరుగుతోందని.. కాని డీమానిటైజేషన్ తరువాత అంత డబ్బు ఎక్కడిది.. దానిలో జిఎస్స్టీ కట్ చేస్తారా అంటూ ఆయన వేసిన సెటైర్ అదిరిపోయింది.