Begin typing your search above and press return to search.

మ‌హాభార‌తంపై డార్లింగ్ మ‌న‌సు ప‌డ్డారు

By:  Tupaki Desk   |   25 April 2017 9:53 AM GMT
మ‌హాభార‌తంపై డార్లింగ్ మ‌న‌సు ప‌డ్డారు
X
ఒక్క సినిమా కోసం నాలుగేళ్ల విలువైన స‌మ‌యాన్ని కేటాయించిన న‌టుడు ప్ర‌భాస్‌. కెరీర్ పీక్స్ లో ఉన్న వేళ‌.. ఇంత సాహ‌సోపేత‌మైన నిర్ణ‌యాన్ని తీసుకోవ‌టంపై అంద‌రూ ఆశ్చ‌ర్యానికి గుర‌య్యారు. కొంద‌రైతే డార్లింగ్‌ ను వార్న్ చేశారు కూడా. అయితే.. రాజ‌మౌళి మీద న‌మ్మ‌కంతో ఆయ‌న మ‌రో మాట లేకుండా.. త‌న డేట్స్ అన్నీ ఆయ‌న‌కు ఇచ్చేశారు. నాలుగేళ్ల వ్య‌వ‌ధిలో కేవ‌లం ఒక్క సినిమాకు ప‌ని చేసిన ప్ర‌భాస్‌.. బాహుబ‌లి అనుభ‌వంతో పెద్ద ప్రాజెక్టుల‌కు ఓకే చెప్పే అవ‌కాశం లేద‌న్న మాట వినిపించింది.

అయితే.. అదంతా త‌ప్ప‌న్న విష‌యాన్ని తాజాగా తేల్చేశారు ప్ర‌భాస్‌. మ‌ల‌యాళంలో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మించ‌నున్న మ‌హాభార‌తం మూవీ మీద ప్ర‌భాస్‌ కు మ‌న‌సైంద‌న్న విష‌యం తాజాగా బ‌య‌ట పెట్టారు డార్లింగ్‌. ఇప్ప‌టికే ఈ క్రేజీ మూవీ గురించి బోలెడ‌న్ని వార్త‌లు మీడియాలో వ‌చ్చేస్తున్నాయి. ఈ భారీ బ‌డ్జెట్ మూవీలో భీముడి క్యారెక్ట‌ర్‌ కు మ‌ల‌యాళం సూప‌ర్‌స్టార్ మోహ‌న్ లాల్ ఓకే చెప్పేయ‌టం తెలిసిందే. ఇక‌.. ఈ మూవీలో అర్జునుడి క్యారెక్ట‌ర్‌కు ప్రిన్స్ మ‌హేశ్ బాబు అయితే బాగుంటుంద‌న్న ఆలోచ‌న‌లో చిత్ర బృందం ఉన్న‌ట్లుగా వార్త‌లు వ‌చ్చాయి.

ఇలాంటి వేళ‌.. ఈ మూవీ గురించి తాజాగా రియాక్ట్ అయ్యారు డార్లింగ్ ప్ర‌భాస్‌. త‌న‌కు అవ‌కాశం వ‌స్తే.. ఈ సినిమాలో ఏ క్యారెక్ట‌ర్ అయినా న‌టించ‌టానికి తాను సిద్ధంగా ఉన్న‌ట్లు ప్ర‌క‌టించారు. త‌న‌ను కానీ మ‌హాభార‌తం టీం సంప్ర‌దిస్తే.. తానుఓకే చెబుతాన‌ని క్లారిటీ ఇచ్చారు ప్ర‌భాస్‌. మ‌రి.. ఆయ‌న స్పంద‌న‌కు మ‌హాభార‌తం టీం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/