Begin typing your search above and press return to search.
ప్రభాస్ ఆ రూట్లో నరుక్కొచ్చాడు!
By: Tupaki Desk | 27 July 2015 9:27 PM GMTతెలుగులో ఓ మంచి స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకొన్న ప్రభాస్ మూడేళ్ల కెరీర్ని త్యాగం చేసి 'బాహుబలి' చేశాడు. చాలా మంది ప్రభాస్ దుస్సాహసం చేస్తున్నాడన్నారు. అయినా సరే.. ప్రభాస్ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఆ ప్రయత్నం ఆయనకి మంచి ఫలితాన్నే ఇచ్చింది. 'బాహుబలి' అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకొంది. తెలుగులో అయితే ప్రభాస్ నెంబర్ వన్ అని కీర్తిస్తున్నారు. అయితే బాలీవుడ్ లో మాత్రం ప్రభాస్ కి దక్కాల్సిన గుర్తింపు దక్కలేదు. అక్కడంతా 'బాహుబలి' అనగానే అందులో ప్రతినాయకుడిగా నటించిన రానా నే కీర్తిస్తున్నారు. అమితాబ్ నుంచి సల్మాన్ వరకు ప్రతి ఒక్కరూ రానా పేరే జపించారు తప్ప కథానాయకుడిగా నటించిన ప్రభాస్ గురించి మాత్రం పెద్దగా మాట్లాడలేదు. దీంతో ప్రభాస్ దెబ్బైపోయినట్టు కనిపించారు.
ఎంత పెద్ద సినిమా చేసినా బాలీవుడ్ లో మాత్రం ఆయనకి గుర్తింపు రాలేదే అని అభిమానులు కాస్త డీలా పడినట్టు కనిపించారు. రానా ఇప్పటికే బాలీవుడ్ లో నాలుగైదు సినిమాలు చేయడం, అక్కడ ఆయనకి మంచి పీఆర్ ఉండటంతో రానా పేరు మార్మోగిపోయింది. ప్రభాస్ ఇక ఇలా కాదని వేరే రూట్లో నరుక్కొస్తున్నాడిప్పుడు. తన పెదనాన్న కృష్ణంరాజుకి ఉన్న పొలిటికల్ పవర్ ని ఉపయోగించుకొని బాలీవుడ్ లో వెలిగిపోయేందుకు ప్రభాస్ పక్కాగా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే రాజ్ నాథ్ సింగ్, అద్వానీ తదితర ప్రముఖుల్ని కలిశాడనీ, దీంతో జాతీయస్థాయిలో ప్రభాస్ కి ప్రచారం లభించిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
నిన్న ప్రధానమంత్రి నరేంద్రమోఢీ ని కలిశాడు. ఆయన ఏకంగా ప్రభాస్ ఫొటోని పెట్టి బాహుబలిని కలిశా అని ట్వీట్ చేశాడు. దీంతో జాతీయస్థాయిలో 'బాహుబలి'కీ, కథానాయకుడు ప్రభాస్ కీ ప్రచారం లభించింది. ప్రభాస్ ఒక్కసారిగా ఆ రేంజ్ లో వెలిగిపోవడంతో ఇప్పుడు బాలీవుడ్ జనాలు కూడా ఆయన గురించి మాట్లాడుకొంటున్నారు. పనిలో పనిగా అజయ్ దేవగణ్ తోనూ కలిసి మాట్లాడాడు ప్రభాస్. ఇదివరకు అజయ్ దేవగణ్ 'యాక్షన్ జాక్సన్'లో ప్రభాస్ తళుక్కున మెరిశాడు. ఇలా బాలీవుడ్ లోనూ ప్రముఖులందరినీ కలిసి ప్రభాస్ తనని తాను పరిచయం చేసుకొంటుండటంతో రానా హవా కాస్త తగ్గినట్టయింది.
ఎంత పెద్ద సినిమా చేసినా బాలీవుడ్ లో మాత్రం ఆయనకి గుర్తింపు రాలేదే అని అభిమానులు కాస్త డీలా పడినట్టు కనిపించారు. రానా ఇప్పటికే బాలీవుడ్ లో నాలుగైదు సినిమాలు చేయడం, అక్కడ ఆయనకి మంచి పీఆర్ ఉండటంతో రానా పేరు మార్మోగిపోయింది. ప్రభాస్ ఇక ఇలా కాదని వేరే రూట్లో నరుక్కొస్తున్నాడిప్పుడు. తన పెదనాన్న కృష్ణంరాజుకి ఉన్న పొలిటికల్ పవర్ ని ఉపయోగించుకొని బాలీవుడ్ లో వెలిగిపోయేందుకు ప్రభాస్ పక్కాగా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే రాజ్ నాథ్ సింగ్, అద్వానీ తదితర ప్రముఖుల్ని కలిశాడనీ, దీంతో జాతీయస్థాయిలో ప్రభాస్ కి ప్రచారం లభించిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
నిన్న ప్రధానమంత్రి నరేంద్రమోఢీ ని కలిశాడు. ఆయన ఏకంగా ప్రభాస్ ఫొటోని పెట్టి బాహుబలిని కలిశా అని ట్వీట్ చేశాడు. దీంతో జాతీయస్థాయిలో 'బాహుబలి'కీ, కథానాయకుడు ప్రభాస్ కీ ప్రచారం లభించింది. ప్రభాస్ ఒక్కసారిగా ఆ రేంజ్ లో వెలిగిపోవడంతో ఇప్పుడు బాలీవుడ్ జనాలు కూడా ఆయన గురించి మాట్లాడుకొంటున్నారు. పనిలో పనిగా అజయ్ దేవగణ్ తోనూ కలిసి మాట్లాడాడు ప్రభాస్. ఇదివరకు అజయ్ దేవగణ్ 'యాక్షన్ జాక్సన్'లో ప్రభాస్ తళుక్కున మెరిశాడు. ఇలా బాలీవుడ్ లోనూ ప్రముఖులందరినీ కలిసి ప్రభాస్ తనని తాను పరిచయం చేసుకొంటుండటంతో రానా హవా కాస్త తగ్గినట్టయింది.