Begin typing your search above and press return to search.
భళిరా 'సైరా' స్టార్ తో 'సాహో' స్టార్!
By: Tupaki Desk | 20 Aug 2019 1:42 PM GMTసౌత్ ధమాకా ఎలా ఉంటుందో బాలీవుడ్ వాళ్లకు ఇప్పుడిప్పుడే తెలిసొస్తోంది. `బాహుబలి` ఫ్రాంఛైజీ ట్రీట్ ని ఇంకా మర్చిపోక ముందే ఈసారి డబుల్ ట్రీట్ రెడీ అవుతోంది. 2019లో వరుసగా రెండు మోస్ట్ అవైటెడ్ సినిమాలు రిలీజవుతున్నాయి. అవి రెండూ తెలుగు గడ్డ మీద నుంచే బాలీవుడ్ పై దండయాత్రకు వెళుతున్నాయి. ప్రస్తుతం ఈ రెండు సినిమాలపైనా ముంబై మీడియాలోనూ ఆసక్తికర చర్చ సాగుతోంది. `సాహో` మేకింగ్- ట్రైలర్ తో మెస్మరైజ్ అయిపోయిన ముంబై మీడియా .. లేటెస్టుగా `సైరా` మేకింగ్ వీడియో- టీజర్ లను చూసి షాక్ తింది. ఇది బాలీవుడ్ కి ఎర్త్ షేకింగ్ ట్రీట్ అనే చెప్పాలి.
ఆసక్తికరంగా నేడు ముంబై ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి - నిర్మాత రామ్ చరణ్- సురేందర్ రెడ్డి- సుదీప్ తదితర బృందం టీజర్ ని లాంచ్ చేశారు. అయితే అక్కడ ఊహించని విధంగా ఓ సర్ ప్రైజ్ ఎదురైంది.
సైరా ఈవెంట్ అయిపోగానే టీమ్ ని గ్రీట్ చేసేందుకు అక్కడికి `సాహో` స్టార్ ప్రభాస్ విచ్చేశాడు. అక్కడ నిర్మాత రామ్ చరణ్ .. మెగాస్టార్ చిరంజీవిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా ఆ ముగ్గురూ కలిసి ఉన్న ఫోటో అంతర్జాలంలోకి రిలీజైంది.
ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తన సినిమా సాహో ప్రమోషనల్ ఇంటర్వ్యూలో ప్రభాస్ ఓ మాట అన్నారు. ``చిరంజీవి గారు ట్రైలర్ చూసి అభినందిస్తూ మెసేజ్ చేశారు. వెంటనే కాల్ చేసి నేను మాట్లాడాను. ఆయన ప్రశంస దక్కడం గొప్ప అనుభూతినిచ్చింది. మర్చిపోలేని అనుభూతి కలిగింది`` అని ప్రభాస్ అన్నారు. ఎంతో డౌన్ టు ఎర్త్ ఉండే డార్లింగ్ ఇప్పుడు ఇలా `సైరా` ఈవెంట్ దగ్గరికే వెళ్లి ఇలా అభినందించడం అభిమానులకు సంబరం లాంటిదే. సాహో- సైరా చిత్రాల్ని గంపగుత్తగా మెగా- రెబల్ ఫ్యాన్స్ బ్లాక్ బస్టర్లు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ రెండు సినిమాలు తెలుగు సినిమాని నెక్ట్స్ లెవల్ కి తీసుకెళ్లబోతున్నాయని సంకేతం కనిపిస్తోంది.
ఆసక్తికరంగా నేడు ముంబై ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి - నిర్మాత రామ్ చరణ్- సురేందర్ రెడ్డి- సుదీప్ తదితర బృందం టీజర్ ని లాంచ్ చేశారు. అయితే అక్కడ ఊహించని విధంగా ఓ సర్ ప్రైజ్ ఎదురైంది.
సైరా ఈవెంట్ అయిపోగానే టీమ్ ని గ్రీట్ చేసేందుకు అక్కడికి `సాహో` స్టార్ ప్రభాస్ విచ్చేశాడు. అక్కడ నిర్మాత రామ్ చరణ్ .. మెగాస్టార్ చిరంజీవిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా ఆ ముగ్గురూ కలిసి ఉన్న ఫోటో అంతర్జాలంలోకి రిలీజైంది.
ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తన సినిమా సాహో ప్రమోషనల్ ఇంటర్వ్యూలో ప్రభాస్ ఓ మాట అన్నారు. ``చిరంజీవి గారు ట్రైలర్ చూసి అభినందిస్తూ మెసేజ్ చేశారు. వెంటనే కాల్ చేసి నేను మాట్లాడాను. ఆయన ప్రశంస దక్కడం గొప్ప అనుభూతినిచ్చింది. మర్చిపోలేని అనుభూతి కలిగింది`` అని ప్రభాస్ అన్నారు. ఎంతో డౌన్ టు ఎర్త్ ఉండే డార్లింగ్ ఇప్పుడు ఇలా `సైరా` ఈవెంట్ దగ్గరికే వెళ్లి ఇలా అభినందించడం అభిమానులకు సంబరం లాంటిదే. సాహో- సైరా చిత్రాల్ని గంపగుత్తగా మెగా- రెబల్ ఫ్యాన్స్ బ్లాక్ బస్టర్లు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ రెండు సినిమాలు తెలుగు సినిమాని నెక్ట్స్ లెవల్ కి తీసుకెళ్లబోతున్నాయని సంకేతం కనిపిస్తోంది.