Begin typing your search above and press return to search.

బాహుబలికి అన్యాయం చేశారంటున్న ఫ్యాన్స్

By:  Tupaki Desk   |   19 Jun 2018 4:45 AM GMT
బాహుబలికి అన్యాయం చేశారంటున్న ఫ్యాన్స్
X
దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో గతేడాది వచ్చి బాహుబలి-2 తెలుగు సినిమా చరిత్రను తిరగరాసింది. భారతీయ సినిమాలో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా అరుదైన రికార్డు దక్కించుకుంది. ఇండియాలో విడుదలైన అన్ని భాషల్లోనూ ప్రేక్షకులు బాహుబలికి బ్రహ్మరథం పట్టారు. అలాంటి బాహుబలికి అన్యాయం చేశారంటూ హీరో ప్రభాస్ ఫ్యాన్స్ ఇప్పుడు తెగ ఆగ్రహంతో ఉన్నారు.

తాజాగా ప్రకటించిన ఫిలిం ఫేర్ అవార్డ్స్ లో ఉత్తమ నటుడిగా ప్రభాస్ కు చోటు దక్కలేదు. జ్యూరీ బెస్ట్ యాక్టర్ గా అర్జున్ రెడ్డి మూవీకిగాను విజయ్ దేవరకొండను సెలక్ట్ చేసింది. ఫిలిం ఫేర్ జ్యూరీ కమిటీ నిర్ణయం పట్ల టాలీవుడ్ అంతా హ్యాపీగానే ఉన్నా ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ ఐదేళ్ల టైం బాహుబలి సినిమా కోసమే కేటాయించాడు. ఆ సినిమా కోసం అతడు పడిన కష్టం మామూలుది కాదు. అలాంటప్పుడు అతడిని సెలక్ట్ చేయకపోవడం కరెక్ట్ కాదంటూ సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

నెక్ట్స్ ఇయర్ నుంచి ఫిలిం ఫేర్ అవార్డులను బాయ్ కాట్ చేయాలంటూ ప్రభాస్ ఫ్యాన్స్ లో కొందరు పిలుపునివ్వడం మొదలుపెట్టారు. ఈసారి ఫిలిం ఫేర్ అవార్డ్స్ లో స్టార్ హీరోలెవరికీ పెద్దగా అవార్డులు రాలేదు. ఈ విషయం తెలిసే చాలామంది అవార్డ్స్ ఫంక్షన్ కు దూరంగానే ఉండిపోయారు.