Begin typing your search above and press return to search.

ప‌వ‌న్‌-మ‌హేష్‌-బ‌న్నీ ఒక్క‌ట‌య్యారా..!

By:  Tupaki Desk   |   26 Nov 2015 8:40 AM GMT
ప‌వ‌న్‌-మ‌హేష్‌-బ‌న్నీ ఒక్క‌ట‌య్యారా..!
X
ప్ర‌స్తుతం తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో మంచి ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇది ఇండ‌స్ర్టీ వ‌ర‌కు చూసుకుంటే ఆరోగ్య ప‌రిణామం అని చెప్పుకోవాల్సిందే. ఒక‌ప్పుడు ఇండ‌స్ర్టీలో ఒకే రోజున ఇద్ద‌రు పెద్ద హీరోలు నటించిన సినిమాలు రిలీజ్ అయ్యేవి. అయితే ఇటీవ‌ల హీరోల మ‌ధ్య ఆరోగ్య‌క‌ర‌మైన వాతావ‌ర‌ణం నెల‌కొంటుంది. ఒక‌ప్పుడు త‌మ సినిమాల‌ రిలీజ్ ను ప్రెస్టీజియ‌స్‌ గా తీసుకునే హీరోలు ఇప్పుడు ఇత‌ర హీరోల సినిమాల‌కు త‌మ సినిమాల‌కు మ‌ధ్య వారం రోజుల పాటు గ్యాప్ ఉండేలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు.

సినిమా ఓపెనింగ్స్ క‌లెక్ష‌న్ల విష‌యంలో ఎవ్వ‌రి సినిమాకు గండి ప‌డ‌కుండా ఉండేలా ఒక‌రికొక‌రు స‌హ‌క‌రించుకుంటూ టాలీవుడ్ స‌క్సెస్ రేటును పెంచేందుకు అగ్ర క‌థానాయ‌కులంతా ప్ర‌య‌త్నిస్తుడ‌డం శుభ‌ప‌రిణామం. ఇందులో భాగంగానే టాలీవుడ్ టాప్ హీరోలైన ప్రిన్స్ మ‌హేష్‌బాబు - ప‌వ‌ర్‌ స్టార్ ప‌వ‌న్‌ క‌ళ్యాణ్‌ - స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ మ‌ధ్య ఓ ఒప్పందం కుదిరిన‌ట్టు తెలుస్తోంది. ఈ ముగ్గురు హీరోలు న‌టించిన సినిమాలు స‌మ్మ‌ర్‌ లో రిలీజ్ కానున్నాయి.

అయితే స‌ర్దార్ రిలీజ్ డేట్‌ పై క్లారిటీ లేక‌పోవ‌డంతో మ‌హేష్ స్వ‌యంగా ప‌వ‌న్‌ కు ఫోన్ చేసి స‌ర్దార్ రిలీజ్ డేట్‌ పై క్లారిటీ ఇవ్వ‌మ‌ని అడిగిన‌ట్టు స‌మాచారం. మ‌హేష్ కాల్‌ కు స్పందించిన ప‌వ‌న్ స‌ర్దార్ రిలీజ్ డేట్‌ పై మ‌హేష్‌ కు క్లారిటీ ఇచ్చాడ‌ట‌. స‌ర్దార్‌ లో మార్చిలో వ‌స్తుంటే ...బ్ర‌హ్మోత్స‌వం ఏప్రిల్‌ కు షిఫ్ట్ అయ్యింది. బ్ర‌హ్మోత్స‌వం త‌ర్వాత రెండు వారాల గ్యాప్‌ లో బ‌న్నీ స‌రైనోడుతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తాడ‌ని తెలుస్తోంది. ఒక‌వేళ ఒకే వారంలో ఈ సినిమాల‌న్నీ రిలీజ్ అయితే హిట్ టాక్ తెచ్చుకున్నా క‌లెక్ష‌న్ల‌కు గండిప‌డి నిర్మాత‌ల‌కు న‌ష్టాలు వ‌చ్చే ఛాన్సులే ఉన్నాయి.

దీంతో వీరు ముగ్గురు ఓ అండర్ స్టాండింగ్‌ కు రావ‌డంతో కాస్త గ్యాప్‌ లో మూడు సినిమాలు గ్రాండ్‌ గా ఎక్కువ థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి. టాలీవుడ్‌ లో అగ్ర హీరోలంద‌రూ ఇదే సూత్రం పాటిస్తే మంచి ప‌రిణామంగా చెప్పుకోవాలి.