Begin typing your search above and press return to search.

థర్టీ ప్లస్ లో పల్లవి మొదలుపెట్టింది

By:  Tupaki Desk   |   27 Oct 2016 7:30 AM GMT
థర్టీ ప్లస్ లో పల్లవి మొదలుపెట్టింది
X
మోడల్ కం హిందీ సీరియల్ యాక్ట్రెస్ అయిన పల్లవి సుభాష్.. టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయం అవుతోంది. సౌత్ లో హీరోయిన్ గా అడుగుపెట్టేందుకు గతంలో కూడా ట్రై చేసింది కానీ.. అమ్మడికి కాలం కలిసి రాలేదు. కన్నడ.. తమిళ్ సినిమాలు చేసినా అవేవీ విడుదలకు నోచుకోలేదు. ఇక గౌతమ్ మీనన్ తో కూడా ఓ సినిమా కోసం కొన్ని రోజులు పని చేసి.. తర్వాత తప్పుకున్న ఎక్స్ పీరియన్స్ ఈమెకు ఉంది.

ఇప్పుడు 32 ఏళ్ల వయసులో సుమంత్ నరుడా.. డోనరుడా మూవీతో తెలుగులోకి హీరోయిన్ ఎంట్రీ ఇస్తోంది పల్లవి సుభాష్. 'ఇది రెగ్యులర్ గా వచ్చే సినిమా టైపులో ఉండదు. ఇలాంటి కొత్త సినిమా ఏదన్నా ట్రై చేద్దామని ఎప్పటినుంచో అనుకుంటే.. సుమంత్ నుంచి నాకు ఈ అద్భతమైన ఆఫర్ వచ్చింది. యామీ గౌతమ్ ఈ రోల్ ను అద్భుతంగా చేసింది. నేను ఆమె మాదిరిగానే మెప్పించేందుకు ప్రయత్నిస్తా' అని చెప్పింది పల్లవి సుభాష్.

పేరు సంపాదించేందుకు గ్లామర్ ఇండస్ట్రీలోకి వచ్చి.. తర్వాత కష్టాలు పడుతూ ఉంటారు భామలు. కానీ పల్లవి మాత్రం మాత్రం ఇంట్లో ఎదురైన ఆర్థిక కష్టాల కారణంగానే.. ఈ రంగాన్ని తప్పనిసరిగా ఎంచుకుని మరాఠీ మూవీస్ తో కెరీర్ స్టార్ట్ చేసి.. ఆ థర్వాత హిందీ టీవీ సీరయల్స్ లో బోలెడంత గుర్తింపు సంపాదించేసి.. ఇప్పుడు తెలుగులోకి కూడా వచ్చేస్తోంది. ఈమె ట్యాలెంట్ ఇక్కడ కూడా వర్కవుట్ అవుతుందనే అంచనాలున్నాయ్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/