Begin typing your search above and press return to search.

ఫస్ట్ సేఫ్ హిమజ..గెస్ట్‌ గా పీవీ సింధు...

By:  Tupaki Desk   |   15 Sep 2019 6:47 AM GMT
ఫస్ట్ సేఫ్ హిమజ..గెస్ట్‌ గా పీవీ సింధు...
X
హాట్ హాట్ సాగుతున్న బిగ్‌ బాస్ షో లోకి వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ తెలుగు అమ్మాయి పీవీ సింధు గెస్ట్ గా ఎంట్రీ ఇచ్చింది. నాగార్జున ఇంటి సభ్యుల్లో ఇన్ స్పిరేషన్ పెంచేందుకు పీవీ సింధు - కోచ్ పుల్లెల గోపి చంద్‌ లని బిగ్ బాస్ స్టేజ్ మీదకు తీసుకొచ్చారు. వెంటనే వీరిని మన టీవీ ద్వారా ఇంటి సభ్యులకు చూపించారు. దీంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యి... సింధుకు వెల్ కం చెప్పారు. ఆ తర్వాత పీవీ సింధు వరల్డ్ ఛాంపియన్ అయిన విషయాన్ని ఇంటి సభ్యులకు చెప్పారు. వారు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చి చప్పట్లతో అభినందనలు తెలియజేశారు.

ఇక తర్వాత సింధు కంటెస్టెంట్స్‌ తో సరదాగా ముచ్చటించారు. తనకు హౌస్‌‌ లో అందరూ ఇష్టమే అని చెప్పి... రాహుల్ పాట పాడితే.. బాబా భాస్కర్ డాన్స్ చేయడం చూడాలని చెప్పడంతో... ఇద్దరు మంచి పెర్ఫార్మన్స్ చేసి ఆకట్టుకున్నారు. సింధు వెళ్లిపోయాక నాగార్జున ఇంటి సభ్యులతో ఓ గేమ్ ఆడించారు. గేమ్ అయిపోయాక నాగ్ ఎలిమినేషన్ ప్రక్రియ చేపట్టారు. ఎలిమినేషన్ లో ఉన్న మహేశ్ - శ్రీముఖి - హిమజ - శిల్ప - పునర్నవిలని ఒక్కొక్కరిని ఒక్కో రూమ్ లోకి వెళ్లాలని 5 కౌంట్ చేశాక... ఎవరి డోర్ అయితే తెరుచుకుంటుందో వారు సేఫ్ అవుతారని చెప్పారు.

దీంతో అందరూ ఒక్కో రూమ్ లోకి వెళ్లారు. అయితే హిమజ రూమ్ ఒకటే తెరుచుకోవడంతో... ఆమె సేవ్ అయినట్లు ప్రకటించారు. అయితే హిమజ ముందే సేఫ్ అవుతుందని ఎవరు ఊహించలేదు. ఆమె ముందు సేఫ్ కావడంతో ఇంటి సభ్యులు కొంత షాక్‌ కు గురయ్యారు. ఇక దీని బట్టి చూస్తుంటే హిమజ హౌస్‌ లో స్ట్రాంగ్ కంటెస్టంట్ గా మారిందని అర్ధం చేసుకోవచ్చు. ఇక ఎలిమినేషన్ లో మహేశ్ - శ్రీముఖి - శిల్ప - పునర్నవి ఉన్నారు. అయితే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం ఈ వారం శిల్ప ఇంటి నుంచి బయటకు వెళుతుందని అంటున్నారు. చూడాలి మరి ఆదివారం ఎపిసోడ్‌ లో ఎవరు ? బయటకెళతారో చూడాలి.