Begin typing your search above and press return to search.

చెర్రీ-ఎన్టీఆర్ లకు ఇబ్బందే లేదా??

By:  Tupaki Desk   |   26 April 2018 7:12 AM GMT
చెర్రీ-ఎన్టీఆర్ లకు ఇబ్బందే లేదా??
X
టాలీవుడ్ ను రకరకాల సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. గత నెలల ఎగ్జిబిటర్ల బంద్ జరగగా.. కొద్ది రోజుల తర్వాత సెటిల్ అయింది. రీసెంట్ గా క్యాస్టింగ్ కౌచ్ వివాదం పీక్ స్టేజ్ కి చేరుకోగా.. ఇందులో పాలిటిక్స్ కూడా ఉన్నాయని పవన్ కళ్యాణ్ అనడంతో.. ప్రస్తుతం ఈ వ్యవహారం నివురు గప్పిన నిప్పులా ఉంది.

ఆ వెంటనే మొదలైన లైట్ మెన్ సమ్మె కారణంగా.. ఇప్పుడు షూటింగులు నిలిచిపోయే పరిస్థితి నెలకొంది. తమకు వేతనాలు పెంచాలని కొద్ది కాలం నుంచి డిమాండ్ చేస్తున్న వీరు.. తాజాగా నిర్మాతలు చేసిన ప్రతిపాదనకు అంగీకరించలేదు. అలాగే హాఫ్ డే కాల్షీట్స్ విషయంలో కూడా అంగీకరించే సమస్యే లేదని తేల్చేశారు. లైట్ మెన్ సమ్మె కారణగంగా దాదాపుగా టాలీవుడ్ లో షూటింగులు అన్నీ నిలిచిపోయాయి. ముంబై వంటి ప్రాంతాల నుంచి లైట్ మెన్ ను తీసుకువచ్చి షూటింగ్ చేస్తే.. వాటిని అడ్డుకుంటామని ముందే హెచ్చరించడంతో ఈ పరిస్థితి నెలకొంది.

అయితే.. ఈ సిట్యుయేషన్ కారణంగా.. టాలీవుడ్ లో దాదాపు అన్ని సినిమాల షూటింగ్స్ ఆగిపోయినా.. రామ్ చరణ్- బోయపాటి కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం.. అలాగే త్రివిక్రమ్- ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాల షూటింగులు మాత్రం ఆగలేదట. ఈ రెండు సినిమాలను ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలోనే షూట్ చేస్తున్నారు. ఇక్కడకు బయటి వ్యక్తులను అనుమతించే పరిస్థితి లేదు. దీంతో ఇతర ప్రాంతాల నుంచి లైట్ మెన్ ను తీసుకొచ్చి షూటింగ్ కొనసాగిస్తున్నట్లుగా చెబుతున్నారు.