Begin typing your search above and press return to search.

కోలీవుడ్ ప్ర‌ముఖుల‌కు నీల‌గిరి కోర్టు షాక్‌!

By:  Tupaki Desk   |   23 May 2017 12:14 PM GMT
కోలీవుడ్ ప్ర‌ముఖుల‌కు నీల‌గిరి కోర్టు షాక్‌!
X
కోలీవుడ్ ప్ర‌ముఖుల‌కు ఊహించ‌ని షాక్ త‌గిలింది. ప్ర‌ముఖ సినీ న‌టుల‌తో పాటు ప‌లువురికి నీల‌గిరి కోర్టు ఇచ్చిన ఆదేశాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ప్ర‌ముఖ హీరో సూర్య‌.. మ‌రో ప్ర‌ముఖ హీరోయిన్ తో స‌హా ఏడుగురికి వారెంట్లు ఇష్యూ చేస్తూ నీల‌గిరి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. హీరో సూర్య‌.. హీరోయిన్ ప్రియ‌తో పాటు.. మ‌రో ఏడుగురికి మంగ‌ళ‌వారం నీల‌గిరి కోర్టు వారెంట్ జారీ చేసింది.

ఎందుకిలా జ‌రిగింద‌న్న విష‌యానికి వెళితే.. వివిధ సంద‌ర్భాల్లో మీడియా మీద అనుచిత వ్యాఖ్య‌లు చేసిన వైనంపై కోర్టు స్పందించి తాజా వారెంట్లు ఇష్యూ చేసింది. హీరో సూర్య‌కు పీటీ వారెంట్.. మిగిలిన ఆరుగురికి నాన్ బెయిల్‌బుల్ వారెంట్లు జారీ కావ‌టం గ‌మ‌నార్హం.

వారెంట్లు జారీ అయిన న‌టుల్లో శ‌ర‌త్ కుమార్‌.. స‌త్య‌రాజ్ తో పాటు హాస్య‌న‌టులు వివేక్‌.. వ‌ర్థ‌మాన న‌టుడు అరుణ్ విజ‌య్‌.. ద‌ర్శ‌కుడు చ‌ర‌ణ్‌ల‌కు జిల్లా కోర్టు ఆదేశాలు చేసింది. వివిధ సంద‌ర్భాల్లో పాత్రికేయుల్ని అవ‌మానిస్తూ అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌టంపై.. పాత్రికేయులు కోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన నీల‌గిరి కోర్టు సినీ ప్ర‌ముఖుల‌కు ప‌లువురికి వారెంట్లు ఇష్యూ చేయ‌టంం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గ‌తంలో ఎప్పుడూ లేని విధంగా ఒకేసారి ఏడుగురు కోలీవుడ్ ప్ర‌ముఖుల‌కు కోర్టు వారెంట్లు ఇష్యూ చేయ‌టం ఇప్పుడు అంద‌రి నోటా నానుతోంది. మ‌రి.. వారెంట్ల‌కు సినీ ప్ర‌ముఖులు ఎలా రియాక్ట్ అవుతార‌న్న‌ది ఇప్పుడు పెద్ద ప్ర‌శ్న‌గా మారింది.