Begin typing your search above and press return to search.

క‌ళ్ల‌న్నీ బెంగ‌ళూరు బాలిక‌ పైనే!

By:  Tupaki Desk   |   19 Jan 2019 4:53 PM GMT
క‌ళ్ల‌న్నీ బెంగ‌ళూరు బాలిక‌ పైనే!
X
అక్కినేని బుల్లోడు అఖిల్ క‌థానాయ‌కుడిగా న‌టించిన `మిస్ట‌ర్ మ‌జ్ను` ట్రైల‌ర్ ఈవెంట్ నేటి సాయంత్రం హైద‌రాబాద్ జేఆర్‌సీలో అక్కినేని అభిమానుల మ‌ధ్య ఘ‌నంగా జ‌రుగుతోంది. అఖిల్ ఫ్యాన్స్ జేఆర్‌ సీ వ‌ద్ద‌ భారీగా మోహ‌రించారు. య‌థావిధిగా కొంద‌రు ఫ్యాన్స్ జేఆర్‌ సీ గేట్ ముందు కుస్తీలు ప‌డుతూ క‌నిపించారు. పాస్ లు ఉన్న అభిమానుల్ని లోనికి రానివ్వ‌క‌పోవ‌డంతో అక్క‌డ కాస్తంత ర‌సాభాస‌గానే ఉంది.

ఇక‌పోతే ఈ లైవ్ వేడుక‌కు మ‌జ్ను అక్కినేని నాగార్జున‌- యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ విచ్చేశారు. అఖిల్ - నిధి అగ‌ర్వాల్, అక్కినేని నాగ‌చైత‌న్య‌ - మైత్రి నిర్మాత‌లు - బివిఎస్ ఎన్ ప్ర‌సాద్ త‌దిత‌రులు విచ్చేశారు. ఈ వేడుక ఆద్యంతం బెంగ‌ళూరు బ్యూటీ .. అక్కినేని క‌థానాయిక‌ నిధి అగ‌ర్వాల్ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. వేదిక వ‌ద్ద యువ‌త‌రం క‌ళ్ల‌న్నీ ఈ బెంగ‌ళూరు బాలిక‌పైనే. నిధి చాలా సింపుల్ గా వైట్ & బ్రౌన్‌ డిజైన‌ర్ లెహంగాలో విచ్చేసి ఈవెంట్ ని చాలా ఎగ్జ‌యిటింగ్ గా వీక్షిస్తోంది.

ఇక యాంక‌ర్ సుమ టీజ‌ర్ లోని `స్ట్రెస్` అన్న పాయింట్ ని స్ట్రెస్ చేస్తూ నిధిని చాలానే ఇబ్బంది పెట్టేసింది. స్ట్రెస్ వ‌స్తే ఏం చేస్తావ్‌? అంటూ మ‌జ్ను టీమ్ ని - నిధిని సుమ ప్ర‌శ్నించింది. అయితే స్ట్రెస్ త‌గ్గేందుకు నిధి స‌ర్‌ ప్రైజింగ్ ఆన్స‌ర్‌ ని ఇచ్చింది. స్ట్రెస్ వ‌స్తే ఏడ్చేస్తాన‌ని .. ఆ త‌ర్వాత త‌గ్గిపోతుంద‌ని చెప్పింది. అయితే స్ట్రెస్ వ‌స్తే ఏడుపెందుకు? అంటూ అభిమానులు లైవ్ లో కొంటె ప్ర‌శ్న‌లు అడిగేయ‌డం విశేషం. నిధి అగ‌ర్వాల్ డెబ్యూ హీరో నాగ‌చైత‌న్య స్ట్రెస్ పై చాలానే జోకులు వేశాడు. మొత్తానికి లైవ్ ఆద్యంతం అక్కినేని హీరోలు ర‌క్తి క‌ట్టిస్తుండ‌డం ఇంట్రెస్టింగ్.