Begin typing your search above and press return to search.

మోడీ వ‌ల్ల ప‌వ‌న్ సినిమాల‌కు బ్రేక్‌

By:  Tupaki Desk   |   23 Jan 2018 8:39 AM GMT
మోడీ వ‌ల్ల ప‌వ‌న్ సినిమాల‌కు బ్రేక్‌
X
ప‌వర్ స్టార్‌గా కోట్ల మండి గుండెల్లో చోటు సంపాదించాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. ఇప్పుడు పూర్తిస్థాయి రాజ‌కీయ‌నేత‌గా ఎదుగుతున్నాడు. రాజ‌కీయాల్లో ప‌ట్టు సాధించేందుకు సినిమాల‌ను సైతం ప‌క్క‌న పెట్టేయ‌డానికి సిద్ధ‌మైపోయాడు. అత‌ని సినిమా జీవితానికి కొన్ని నెల‌ల పాటూ బ్రేకులు వేయ‌బోతున్నాడు. అందుకే ఒప్పుకున్న సినిమాల‌కు కూడా బై చెప్పి, తీసుకున్న అడ్వాన్స్ ను కూడా తిరిగిచ్చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. త‌న‌కు ప్ర‌స్తుతం సినిమాలు చేయాల‌న్న ఆస‌క్తి లేద‌ని ఓపెన్‌గా చెప్పేస్తున్నాడు.

ఎన్నిక‌ల స‌మ‌యానికి త‌న జ‌న‌సేన పార్టీని బ‌లోపేతం చేయ‌డమే ల‌క్ష్యంగా పెట్టుకున్నాడు ప‌వ‌ర్ స్టార్‌. నిజానికి ప‌వ‌న్ క‌ళ్యాన్ అజ్ఞాతవాసి త‌రువాత రెండు సినిమాలు చేసేందుకు ఒప్పుకున్నారు. ఇప్పుడున్న ప‌రిస్థితిలో తాను సినిమాలు చేసే ఆలోచ‌న లేద‌ని నేరుగా ప్రెస్ మీట్‌ లోనే చెప్పాడు ప‌వ‌న్‌. త‌మిళ నిర్మాత ఏఎం ర‌త్నం ప‌వ‌న్ తో సినిమా తీసేందుకు ముందే అడ్వాన్స్ తీసుకున్నారు. ఏఎం ర‌త్నం స్ర్కిప్ట్ కూడా రెడీ చేయిస్తున్నారు. అలాగే మైత్రి మూవీ మేక‌ర్స్ కూడా ప‌వ‌న్‌ తో సినిమా తీసేందుకు సిద్ధ‌మైంది. ఈ రెండు సినిమాల నిర్మాత‌ల‌కు సినిమా చేసే ఉద్దేశం లేద‌ని - త్వ‌ర‌లో తీసుకున్న అడ్వాన్స్ తిరిగిచ్చేస్తాన‌ని చెప్పాడు ప‌వ‌న్‌.

ప‌వ‌న్ తీసుకున్న ఈ నిర్ణ‌యం వెనుక ఉన్న‌దెవ‌రో తెలుసా? ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ. ఆయ‌న ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లే అవ‌కాశం ఉన్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఈ ఏడాది చివ‌రికే ఎన్నిక‌లు వ‌చ్చే అవ‌కాశం పుష్క‌లంగా ఉంది. అందుకే ప్ర‌తి జిల్లా తిరిగి పార్టీని - కార్య‌క‌ర్త‌ల‌ను బలోపేతం చేసేందుకు - అలాగే పార్టీ ఫండ్‌ ను సేక‌రించేందుకు ప‌వ‌న్ సినిమా జీవితానికి బ్రేకిచ్చాడు.