Begin typing your search above and press return to search.

ఆ కథ శర్వాది కాదు నాదే!!

By:  Tupaki Desk   |   20 Jan 2018 11:27 AM GMT
ఆ కథ శర్వాది కాదు నాదే!!
X
ప్రస్తుతం యువ హీరోల్లో నాని - శర్వానంద్ మంచి సక్సెస్ లతో దూసుకుపోతున్నారు. గత కొంత కాలంగా ఇద్దరు మంది సక్సెస్ లను అందుకుంటున్నారు. ముఖ్యంగా నాని అయితే నిర్మాతలు బయ్యర్లకు మంచి కలెక్షన్స్ ని అందిస్తున్నాడు. మూడేళ్ళుగా అతని సినిమాలు వరుసగా రికార్డ్ స్థాయిలో ఒకదానికి మించి మరొకటి కలెక్షన్స్ ను అందిస్తున్నాయి. శర్వా కూడా దాదాపు తన కెరీర్ ను అలానే కొనసాగిస్తున్నాడు.

అయితే ఆ మధ్యలో శర్వా కథను నాని చేస్తున్నాడు అని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నాని - మేర్లపాక గాంధీ దర్శకత్వంలో కృష్ణార్జున యుద్ధం అనే సినిమాను చేస్తున్నాడు. ఇంతకుముందు గాంధీ శర్వానంద్ తో ఎక్స్ ప్రెస్ రాజా సినిమా చేసి మంచి హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ తరువాత కూడా కృష్ణార్జున యుద్ధం కథను శర్వాతో చేయాలనీ అతనికి కథ చెప్పగా.. శర్వా చేయనని చెప్పాడని రూమర్స్ వచ్చాయి.

అయితే ఈ విషయంపై రీసెంట్ గా నాని ఒక క్లారిటీ ఇచ్చాడు. అందులో ఎలాంటి నిజం లేదని. కృష్ణార్జున యుద్ధం కథ శర్వాది కాదు. మొదట నా దగ్గరికి రాగానే ఒకే చేశాను అని నాని అనుమానాలకు తెరదించాడు. నాని ఈ సినిమాలో డ్యూయెల్ రోల్ చేస్తోన్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా అందుకు సంబందించిన లుక్స్ ని కూడా చిత్ర యూనిట్ విడుదల చేసింది. మరి ఈ సినిమా న్యాచురల్ స్టార్ సక్సెస్ ట్రాక్ ని పెంచుతుందో లేదో చూడాలి. ఏప్రిల్ లో ఈ మూవీ రిలీజ్ కానుంది.