Begin typing your search above and press return to search.

మరోసారి కొడుకు కోసం రంగంలోకి నాగార్జున

By:  Tupaki Desk   |   17 Sep 2019 5:58 AM GMT
మరోసారి కొడుకు కోసం రంగంలోకి నాగార్జున
X
అక్కినేని ఫ్యాన్స్‌ ఇంకా తెలుగు ప్రేక్షకుల భారీ అంచనాల నడుమ హీరోగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్‌ మంచి కమర్షియల్‌ సక్సెస్‌ ఇవ్వలేక పోయాడు. మొదటి సినిమాతోనే మాస్‌ మసాలా హిట్‌ అందుకోవాలనుకుని 'అఖిల్‌' చేశాడు. అది ఫ్లాప్‌ అవ్వగా ఆ తర్వాత వచ్చిన హలో.. మిస్టర్‌ మజ్ను చిత్రాలు ఒక మోస్తరుగా ఆడాయి. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో అఖిల్‌ తన 4వ సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. అల్లు అరవింద్‌ బ్యానర్‌ లో అఖిల్‌ 4 చిత్రం నిర్మాణం అవుతోంది.

అఖిల్‌ 4 చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సమయంలోనే అఖిల్‌ 5 కి సంబంధించిన చర్చలు జరుగుతున్నట్లుగా సమాచారం అందుతోంది. అఖిల్‌ తో 'హలో' చిత్రాన్ని నిర్మించిన నాగార్జున మరోసారి తన కొడుకుతో సినిమాను నిర్మించేందుకు సన్నాహాలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. అఖిల్‌ కోసం దర్శకుడు పరుశురామ్‌ ఒక కథను సిద్దం చేయడం.. ఆ కథకు నాగార్జున మరియు అఖిల్‌ లు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం జరిగిందట.

ఈ ఏడాది చివర్లో అఖిల్‌ 5 చిత్రం సెట్స్‌ పైకి వెళ్లబోతుంది. పరుశురామ్‌ 'గీత గోవిందం' చిత్రం తర్వాత మహేష్‌ బాబుతో సినిమా చేయాలని ఆశ పడ్డాడు. మహేష్‌ బాబు కూడా ఓకే అన్నట్లుగానే అనిపించింది. కాని ఏం జరిగిందో ఏమో కాని ఇద్దరి కాంబో సెట్‌ కాలేదు. చర్చల దశలోనే ఆ సినిమా అటకెక్కింది. దాంతో పరుశురామ్‌ తన తదుపరి చిత్రంను అఖిల్‌ తో చేసేందుకు సిద్దం అయ్యాడు. నాగార్జున సొంత బ్యానర్‌ అన్నపూర్ణ స్టూడియోలో ఈ చిత్రం నిర్మాణం జరుగబోతున్నట్లుగా అతి త్వరలోనే అధికారికంగా ప్రకటన రాబోతుంది. సూపర్‌ హిట్‌ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్న అఖిల్‌ కు ఈ రెండు సినిమాలు ఎలాంటి ఫలితాలను ఇస్తాయో చూడాలి.