Begin typing your search above and press return to search.

కింగు ను ఎగ్జైట్ చెయ్యని రొమాంటిక్ కామెడీ!

By:  Tupaki Desk   |   2 Nov 2018 4:48 AM GMT
కింగు ను ఎగ్జైట్ చెయ్యని రొమాంటిక్ కామెడీ!
X
అక్కినేని నాగార్జున స్టొరీల ఎంపికలో ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్నాడా అంటే ఔనని అంటున్నాయి ఫిలిం నగర్ వర్గాలు. వరసగా నాలుగు ఫ్లాపుల రావడంతో స్టొరీలను మరింత జాగ్రత్తగా తన వయసుకు తగ్గట్టు ఎంచుకునే ప్రయత్నాలలో ఉన్నాడట. అందుకే డిస్కషన్స్ లో ఉన్న రెండు సినిమాలను ప్రస్తుతానికి పక్కన బెట్టాడని అంటున్నారు.

'చిలసౌ' సినిమా తో డైరెక్టర్ గా అందరినీ ఆకట్టుకున్న రాహుల్ రవీంద్రన్ నాగార్జున కోసం కథ తయారు చేస్తున్నాడని వార్తలు వచ్చాయి.. అది 'మన్మధుడు' సినిమాకు సీక్వెల్ గా న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీగా ఉంటుందని అన్నారు. 'చిలసౌ' ప్రమోషన్స్ సమయంలో రాహుల్ కూడా రెండు కథలపై వర్క్ చెస్తున్నామని ఇంకా ఫైనలైజ్ కాలేదని చెప్పాడు. కానీ తాజా సమాచారం ప్రకారం రాహుల్ వినిపించిన రొమాంటిక్ కామెడీ స్టొరీ ని నాగార్జున రిజెక్ట్ చేశాడట. అది తనకు సూట్ కాదని.. అఖిల్ కు వినిపించమని సూచించాడట. అంతే కాకుండా 'సోగ్గాడే చిన్ని నాయనా' సీక్వెల్ గా ప్లాన్ చేస్తున్న 'బంగార్రాజు' ను కూడా పక్కనబెట్టినట్టేనని వార్తలు వస్తున్నాయి.

ఈలెక్కన నాగార్జునను మెప్పించే సోలో హీరో కథను తీసుకురావడానికి దర్శకులు కాస్త కష్టపడాలిసిందే. ఇదిలా ఉంటే నాగార్జున ప్రస్తుతం 'బ్రహ్మాస్త్ర' అనే బాలీవుడ్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా కాకుండా తమిళంలో ధనుష్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న మరో సినిమాలో కూడా నటిస్తున్నాడు.