Begin typing your search above and press return to search.
ఆ కథ విన్నాక నిద్ర పట్టలేదు-నాగ్
By: Tupaki Desk | 28 Oct 2016 1:30 PM GMTనాగార్జున ఈ మధ్యే ఒక కథ విన్నాడట. ఆ కథ విన్నప్పటి నుంచి నిద్ర పట్టట్లేదట. మరి ఆ కథ యాంకర్ టర్న్డ్ డైరెక్టర్ ఓంకార్ చెప్పిందా.. లేక ఇంకేదైనా కొత్త కథా అన్నది నాగార్జున వెల్లడించలేదు. తన మేనల్లుడు సుమంత్ హీరోగా తెరకెక్కిన ‘నరుడా డోనరుడా’ ఆడియో వేడుకలో భాగంగా నాగార్జున ఈ వ్యాఖ్యలు చేశాడు. సుమంత్ సినిమా గురించి.. తాను విన్న కొత్త కథ గురించి నాగ్ ఇంకా ఏమన్నాడంటే..
‘‘హిందీలో హిట్టయిన విక్కీ డోనర్ ఆధారంగా ‘నరుడా డోనరుడా’ చేశాడు సుమంత్. అతను చాలా రోజుల తర్వాత మంచి స్క్రిప్టుతో వస్తున్నాడు. చక్కటి కామెడీ రోల్ చేశాడు. ఈ సినిమా తెలుగులో బాగుంటుందని నమ్మి చేశాడు. ఇందులో మంచి మెసేజ్ ఉంది. ఎంటర్ టైన్మెంట్ ఉంది. హిందీలో ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయింది. వీర్య దానం అనే కాన్సెప్ట్ మీద సినిమా తీయడం మామూలు విషయం కాదు. పిల్లలు పుట్టే విషయంలో భార్యాభర్తల మధ్య భయాలు.. కాంప్లెక్సెస్.. వీటన్నింటి గురించి చర్చిస్తుందీ సినిమా. ఈ రోజుల్లో.. మెసేజ్.. ఎంటర్టైన్మెంట్ కలిపి ఉన్న సినిమాలు రావడం గగనమైపోయింది. ఐతే ఈ సినిమాకు అన్నీ కుదిరాయి. నేను కొత్తగా ఉంటే ఏ కథనూ కాదనను. నరుడా డోనరుడా లాంటి కథతో నన్ను అడిగినా చేసేవాడిని. ఇప్పుడు నేను ‘ఓం నమో వేంకటేశాయ చేస్తున్నా. ఆ తర్వాత కొత్త జానర్లో ట్రై చేద్దామనుకుంటున్నా. ఈ మధ్యే ఓ కథ విన్నాను. అది విన్నప్పటి నుంచి నిద్ర కూడా పట్టలేదు. అంత బావుంది ఆ కథ’’ అని నాగార్జున చెప్పాడు. మరి నాగ్ కు నిద్ర కూడా లేకుండా చేసిన ఆ కథలో అంత ప్రత్యేకత ఏముందో.. ఈ కథ చెప్పింది ఎవరో?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
‘‘హిందీలో హిట్టయిన విక్కీ డోనర్ ఆధారంగా ‘నరుడా డోనరుడా’ చేశాడు సుమంత్. అతను చాలా రోజుల తర్వాత మంచి స్క్రిప్టుతో వస్తున్నాడు. చక్కటి కామెడీ రోల్ చేశాడు. ఈ సినిమా తెలుగులో బాగుంటుందని నమ్మి చేశాడు. ఇందులో మంచి మెసేజ్ ఉంది. ఎంటర్ టైన్మెంట్ ఉంది. హిందీలో ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయింది. వీర్య దానం అనే కాన్సెప్ట్ మీద సినిమా తీయడం మామూలు విషయం కాదు. పిల్లలు పుట్టే విషయంలో భార్యాభర్తల మధ్య భయాలు.. కాంప్లెక్సెస్.. వీటన్నింటి గురించి చర్చిస్తుందీ సినిమా. ఈ రోజుల్లో.. మెసేజ్.. ఎంటర్టైన్మెంట్ కలిపి ఉన్న సినిమాలు రావడం గగనమైపోయింది. ఐతే ఈ సినిమాకు అన్నీ కుదిరాయి. నేను కొత్తగా ఉంటే ఏ కథనూ కాదనను. నరుడా డోనరుడా లాంటి కథతో నన్ను అడిగినా చేసేవాడిని. ఇప్పుడు నేను ‘ఓం నమో వేంకటేశాయ చేస్తున్నా. ఆ తర్వాత కొత్త జానర్లో ట్రై చేద్దామనుకుంటున్నా. ఈ మధ్యే ఓ కథ విన్నాను. అది విన్నప్పటి నుంచి నిద్ర కూడా పట్టలేదు. అంత బావుంది ఆ కథ’’ అని నాగార్జున చెప్పాడు. మరి నాగ్ కు నిద్ర కూడా లేకుండా చేసిన ఆ కథలో అంత ప్రత్యేకత ఏముందో.. ఈ కథ చెప్పింది ఎవరో?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/