Begin typing your search above and press return to search.

ఏంటి భానుమతి ఈ గొడవ?

By:  Tupaki Desk   |   15 Jan 2018 10:50 AM GMT
ఏంటి భానుమతి ఈ గొడవ?
X
ఫిదా సూపర్ సక్సెస్ తో తెలుగులో కూడా అశేష అభిమానులను సంపాదించుకున్న సాయి పల్లవి తనకున్న ఈగో వల్ల ఇబ్బందులు కలిగిస్తోంది అనే వార్తలు ఎంసిఎ షూటింగ్ టైంలోనే బయటికి వచ్చాయి. నానితో ఏదో క్లాష్ వస్తే దిల్ రాజు మధ్యవర్తిత్వం చేసాడు అనే పుకారు కాస్త గట్టిగానే షికారు చేసింది. దీని గురించి నాని ఓ సందర్భంలో వివరణ ఇస్తూ ఇలాంటి అసత్య ప్రచారాలు చేయకండి, మేము బాగున్నాం అని చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దీన్ని తిరగతోడుతూ హీరో నాగ శౌర్య లైన్ లోకి వచ్చాడు. సాయి పల్లవి, నాగ శౌర్య కలిసి నటించిన కణం అనే మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఇంతకు ముందే ట్రైలర్ కూడా విడుదల చేసారు. తమిళ్ , తెలుగులో ద్విబాషా చిత్రంగా దీన్ని రూపొందించారు. ఇప్పుడు ఈ ఇద్దరి మధ్య గొడవ గురించి నాగ శౌర్య ఓపెన్ అయినట్టుగా తెలిసింది.

సాయి పల్లవికి తాను అందరి కంటే ఎక్కువ అనే ఫీలింగ్ ఉందని, కొందరు హీరోల కంటే తనకే పెద్ద ఇమేజ్ ఉందనేలా ఫీల్ అవుతూ ప్రవర్తిస్తుందని అంటున్న శౌర్య ఫిదా సక్సెస్ లో తన రోల్ మాత్రమే కాకుండా దానికి దోహద పడిన విషయాలు చాలా ఉన్నాయని, అవి గుర్తిస్తే మంచిదని చురక వేస్తున్నాడు. కణం సినిమాను సాయి పల్లవి సినిమాలాగే నిర్మాతలు ప్రమోట్ చేయటం కూడా శౌర్యకు ఇబ్బంది కలిగిస్తున్నట్టు తెలుస్తోంది. ఇద్దరు నటిస్తున్నప్పుడు ప్రమోషన్ లో ఒక్కరినే హై లైట్ చేయటం పట్ల నాగ శౌర్య అసంతృప్తితో ఉన్నాడట. ఇవన్ని నాగ శౌర్య ఒక టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నాడు. దీని గురించి సాయి పల్లవి స్పందన ఇంకా రావాల్సి ఉంది. నాణేనికి రెండు వైపులా ఉన్నట్టు సాయి పల్లవి చెప్పాకే ఈ ఇష్యూ గురించి క్లారిటీ వస్తుంది. తను నిజంగా ఈగో వల్ల ఇబ్బందులు పెడుతోందా లేక తాను ఏమైనా ఇబ్బందులు పడుతోందా అనేది తనే చెప్పేస్తే వీటికి ఫుల్ స్టాప్ పెట్టొచ్చు. ఎంసిఎ తర్వాత సాయి పల్లవి శర్వానంద్ తో ఓ సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి.