Begin typing your search above and press return to search.

శౌర్య కోసం సవ్యసాచి భామ

By:  Tupaki Desk   |   8 Dec 2018 8:40 AM GMT
శౌర్య కోసం సవ్యసాచి భామ
X
యంగ్ హీరో నాగ శౌర్య 'ఛలో' తో గాడిన పడ్డట్టు అనిపించినా.. తర్వాత రిలీజ్ అయిన సినిమాలు నిరాశపరచడంతో తన నెక్స్ట్ సినిమాల ఎంపికలో జాగ్రత్త పడుతున్నాడు. ప్రస్తుతం నందిని రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో సమంతా కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమా కాకుండా మరో చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట శౌర్య.

సుకుమార్ వద్ద గతంలో అసిస్టెంట్ గా పని చేసిన కాశి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తాడు. కాశి చెప్పిన స్టొరీ నచ్చడంతో ఈ సినిమాను సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై నిర్మించడానికి సుకుమార్ సిద్దమయ్యాడట. ఈ సినిమా ఒక రొమాంటిక్ డ్రామా అని సమాచారం. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ అయిందని.. ఈ సినిమాలో శౌర్యకు జోడీగా నిధి అగర్వాల్ ను ఎంపిక చేశారని టాక్ వినిపిస్తోంది. ' సవ్యసాచి' సినిమా తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నిధి ప్రస్తుతం అఖిల్ అప్కమింగ్ ఫిలిం 'Mr. మజ్ను' లో హీరోయిన్ గా నటిస్తోంది.

రెమ్యూనరేషన్.. డేట్స్ విషయాలపై డిస్కషన్స్ జరుగుతున్నాయట. అవి ఫైనలైజ్ ఐతే హీరోయిన్ గా పక్కా అయినట్టే. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో ఉంటుంది. సుకుమార్ బ్యానర్ లో సినిమా అంటే ఖచ్చితంగా ట్రెండీగా ఉండే అవకాశం ఉంది. మరి ఈ సినిమాతో అయినా శౌర్యకు మంచి హిట్ వస్తుందేమో వేచి చూడాలి.