Begin typing your search above and press return to search.

ఆ హీరో మళ్లీ సొంత బేనర్లోనే..

By:  Tupaki Desk   |   18 Feb 2018 5:49 AM GMT
ఆ హీరో మళ్లీ సొంత బేనర్లోనే..
X
ఆరేడేళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు యువ కథానాయకుడు నాగశౌర్య. కెరీర్లో మంచి మంచి సినిమాలున్నాయి. విజయాలున్నాయి. కానీ వాటిలో ఏది కూడా కమర్షియల్ గా ఇరగాడేసింది లేదు. దీంతో అతడికంటూ ఒక మార్కెట్ లేకపోయింది. కానీ నాగశౌర్య కొత్త సినిమా ‘ఛలో’ మాత్రం ఒక్కసారిగా అతడికి మంచి మార్కెట్ క్రియేట్ చేసింది. ఈ సినిమా దాదాపు రూ.8 కోట్ల దాకా షేర్ సాధించి.. శౌర్యను హీరోగా మంచి స్థాయిలో నిలబెట్టింది. ఈ చిత్రాన్ని స్వయంగా నాగశౌర్య కుటుంబమే నిర్మించడం విశేషం. కొత్త దర్శకుడు వెంకీ కుడుములను దర్శకుడిగా పరిచయం చేస్తున్న శౌర్య ఫ్యామిలీ చేసిన ప్రయత్నం మంచి ఫలితాన్నిచ్చింది.

నిర్మాతగా తొలి ప్రయత్నంలోనే మంచి ఫలితాన్నందుకోవడంతో శౌర్య మళ్లీ సొంత ప్రొడక్షన్లో సినిమా చేయడానికి రెడీ అయిపోతున్నాడు. తాను ‘నర్తనశాల’ అనే కొత్త సినిమా చేయబోతున్నట్లు శౌర్య ఇంతకుముందే వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని శ్రీనివాస్ చక్రవర్తి అనే కొత్త దర్శకుడు రూపొందించబోతున్నాడు. ఈ ‘నర్తనశాల’ను ఐరా క్రియేుషన్సే నిర్మించనుంది. మార్చిలో ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్తుందట. ప్రస్తుతం శౌర్య ‘అమ్మమ్మగారిల్లు’ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఇది కాక సినిమాటోగ్రాఫర్ సాయి శ్రీరామ్ దర్శకుడిగా పరిచయం కాబోయే సినిమా కూడా చేయాల్సి ఉంది. ‘ఛలో’తో పాటు శౌర్య నుంచి తర్వాత రాబోయే మూడు సినిమాలకూ దర్శకులు కొత్త వాళ్లే కావడం విశేషం.