Begin typing your search above and press return to search.

దగ్గుబాటి మల్టీ స్టారర్ కి రంగం సిద్ధం

By:  Tupaki Desk   |   18 March 2018 2:24 PM GMT
దగ్గుబాటి మల్టీ స్టారర్ కి రంగం సిద్ధం
X
అక్కినేని అభిమానులు దగ్గుబాటి ఫాన్స్ ఉమ్మడిగా కోరుకున్న కాంబినేషన్ నిజమయ్యే టైం వచ్చేసింది. విక్టరీ వెంకటేష్-నాగ చైతన్య కాంబోలో కొత్త మల్టీ స్టారర్ కు రంగం సిద్ధమయ్యింది. సురేష్ ప్రొడక్షన్స్ తో పాటు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఇందులో నిర్మాణ భాగస్వామి కాగా కోన ఫిలిం కార్పోరేషన్ కూడా ఈ క్రేజీ మూవీ కోసం అసోసియేట్ అవుతోంది. వెంకీ గతంలో ప్రేమం సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా చైతు చదివే కాలేజీకి వచ్చి కాసేపు సందడి చేసినందుకే ఫాన్స్ ఖుషీ అయ్యారు. అలాంటిది ఇద్దరు కలిసి పూర్తి సినిమాలో నటిస్తే వాళ్ళకు అంతకంటే కావాల్సింది ఏముంటుంది. ఈ క్రేజీ మూవీకి దర్శకుడు బాబీ. లాస్ట్ ఇయర్ జూనియర్ ఎన్టీఆర్ జై లవకుశతో బౌన్స్ బ్యాక్ అయ్యి ఫాంలోకి వచ్చిన బాబీ దాని తర్వాత ఇంత గ్యాప్ తీసుకుంది దీని స్క్రిప్ట్ కోసమేనట.

వెంకటేష్-నాగ చైతన్య తమ తమ ప్రాజెక్ట్స్ లో బిజీగా ఉన్నప్పటికీ దీని కోసం ప్రత్యేకంగా కాల్ షీట్స్ సెట్ చేసుకుంటున్నట్టు తెలిసింది. తేజ దర్శకత్వంలో ఆటా నాదే వేటా నాదే(వర్కింగ్ టైటిల్)షూటింగ్ లో వెంకీ బిజీగా ఉండగా చైతు 'సవ్యసాచి' పూర్తి చేసే పనితో పాటు మారుతీ దర్శకత్వంలో 'శైలజారెడ్డి గారి అల్లుడు' కోసం రెడీ అవుతున్నాడు. ఇవి కాకుండా శివ నిర్వాణ దర్శకత్వంలో తన లైఫ్ పార్టనర్ సమంతాతో కలిసి నటించే మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

నాన్న నాగార్జునతో మనంలో నటించిన చైతు ఇప్పుడు మావయ్య వెంకటేష్ తో నటించడం అంటే థ్రిల్ కలిగించే విషయమే. పైగా ఫాన్స్ కోరుకుంటున్న కాంబినేషన్ కాబట్టి సహజంగానే హైప్ వచ్చేస్తుంది. మే లో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ మూవీలో హీరొయిన్ ని, సాంకేతిక వర్గాన్ని సెట్ చేసే పనిలో దర్శకుడు బాబీ బిజీగా ఉన్నట్టు టాక్. యంగ్ హీరోలతో కాంబోలు చేస్తున్న వెంకీ కొత్త ట్రెండ్ కు సారధిగా నిలుస్తున్నాడు.