Begin typing your search above and press return to search.

'వెంకీమామ' అన్ని విషయాలపై అధికారిక ప్రకటన

By:  Tupaki Desk   |   23 Feb 2019 2:52 PM GMT
వెంకీమామ అన్ని విషయాలపై అధికారిక ప్రకటన
X
గత కొన్ని రోజులుగా మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న 'వెంకీమామ' చిత్రం రేపు సెట్స్‌ పైకి వెళ్లబోతుంది. చాలా రోజుల క్రితమే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్రం ఏవో కారణాల వల్ల వాయిదాలు పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ చిత్రం రేపటి నుండి పట్టాలెక్కబోతున్నట్లుగా సురేష్‌ ప్రొడక్షన్స్‌ నుండి అధికారిక ప్రకటన వచ్చింది. ఇక ఈ చిత్రంలో హీరోయిన్స్‌ విషయంలో గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. హీరోయిన్స్‌ విషయంలో కూడా సురేష్‌ ప్రొడక్షన్స్‌ అఫిషియల్‌ గా అనౌన్స్‌ మెంట్‌ చేసింది.

'వెంకీమామ' చిత్రంలో హీరోయిన్స్‌ గా పాయల్‌ రాజ్‌ పూత్‌ మరియు రాశిఖన్నాలు హీరోయిన్స్‌ గా నటించబోతున్నట్లుగా ప్రకటన వచ్చింది. వెంకీకి జోడీగా శ్రియ నటించబోతున్నట్లుగా మొదట వార్తలు వచ్చాయి. కాని ఆ వార్తలు కేవలం పుకార్లే అని తేలిపోయింది. పాయల్‌ రాజ్‌ పూత్‌ - రాశిఖన్నాలు హీరోయిన్స్‌ గా నటించబోతున్న నేపథ్యంలో ఈ చిత్రంపై ఆసక్తి మరింతగా పెరిగింది.

వెంకటేష్‌ కు జోడీగా పాయల్‌ రాజ్‌ పూత్‌ నటించనుండగా - నాగచైతన్యకు జోడీగా రాశిఖన్నా నటించనుంది. బాబీ దర్శకత్వంలో రూపొందబోతున్న ఈ చిత్రంకు సంగీతాన్ని థమన్‌ అందించబోతున్నాడు. 'వెంకీమామ' మొదటి షెడ్యూల్‌ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో అక్కినేని మరియు దగ్గుబాటి ఫ్యాన్స్‌ ఫుల్‌ హ్యాపీగా ఉన్నారు. జెట్‌ స్పీడ్‌ తో మూవీని పూర్తి చేసి దసరా కానుకగా విడుదల చేయాలని సురేష్‌ బాబు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.