Begin typing your search above and press return to search.

మిల్కీ బ్యూటీ.. పోస్టరెక్కిందోచ్

By:  Tupaki Desk   |   29 Sep 2017 8:30 AM GMT
మిల్కీ బ్యూటీ.. పోస్టరెక్కిందోచ్
X
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మొదటిసారి త్రిపాత్రాభినయం లో నటించిన సారికొత్త చిత్రం జై లవకుశ. సినిమా విడుదలకు ముంది భారీ అంచనాలు రేపింది. సినిమా ఫస్ట్ లుక్ నుండి ట్రైలర్ వరకు అన్ని సినిమాను చూడాలనే ఆసక్తిని రేపాయి. ఏ మాత్రం తగ్గకుండా ప్రమోషన్స్ ని కూడా గట్టిగా నిర్వహించడంతో అన్ని వర్గాల ప్రేక్షకుల వద్దకు సినిమా చేరింది. మొదట సినిమా పోస్టర్స్ తోనే చిత్ర యూనిట్ ఎక్కువగా ఆకర్షించింది.

మొదట సినిమాలో ఎన్టీఆర్ మూడు పాత్రాలని ఒక్కొక్కటిగా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఎక్కువగా ఎన్టీఆర్ ఒక్కడే పోస్టర్స్ లో కనిపించేవాడు. అయితే ఆ తర్వాత మెల్లగా చిత్ర కథానాయికలు కూడా పోస్టర్స్ లో దర్శనమిచ్చారు. మొదట రాశిఖన్నా పోస్టర్ ఎక్కింది. ఆ తర్వాత స్మైలి సుందరి నివేద థామస్ కూడా కొత్తగా పోస్టర్ లో పోజులిచ్చింది. ఇక ఫైనల్ గా స్వింగ్ జరా అంటూ ఎన్టీఆర్ తో చిందులు వేసిన మిల్కి బ్యూటీ తమన్నాని కూడా పోస్టర్ ఎక్కించారు. మొత్తానికి సినిమాలో ఈ ముగ్గురు గ్లామర్ షోతో హీటెక్కించారనే చెప్పాలి.

ఇక సినిమా విషయానికి వస్తే మొదటి ఈ చిత్రం ఎన్టీఆర్ స్టార్ హోదాతో ఓపెనింగ్స్ ని బాగానే రాబట్టింది. సినిమాలో కథాంశం పూర్తిగా మెప్పించకపోవడంతో మిక్స్ డ్ టాక్ ని తెచ్చుకుంది. హాలిడేస్ ఉండడంతో బాగానే నడుస్తోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ పై కళ్యాణ్ రామ్ తెరకెక్కించిన ఈ సినిమాను కె.ఎస్.రవీంద్ర తెరకెక్కించాడు.