Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ చెక్ పెట్టేశాడు!!

By:  Tupaki Desk   |   25 April 2018 7:29 AM GMT
ఎన్టీఆర్ చెక్ పెట్టేశాడు!!
X
టాలీవుడ్ లో గత కొంత కాలంగా ఒక రూమర్ చాలా స్ట్రాంగ్ గా వినిపిస్తోంది. నందమూరి బ్రదర్స్ మధ్య విభేదాలు వచ్చాయని ఇద్దరి మధ్య మాటలు లేవని రూమర్స్ వచ్చాయి. అందుకు కొన్ని కారణాలు కూడా రూమర్స్ కి బూస్ట్ ఇచ్చాయి. జై లవకుశ సినిమాతో కళ్యాణ్ రామ్ నిర్మాతగా తమ్ముడి సినిమాను తెరకెక్కించి బాగా దగ్గరయ్యాడు. అయితే తారక్ మాత్రం ఆ తరువాత కళ్యాణ్ రామ్ ను పట్టించుకోవడం లేదని టాక్ వచ్చింది.

ముఖ్యంగా కళ్యాణ్ రామ్ నటించిన ఎమ్ఎల్ఏ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ కోసం తారక్ ఎలాంటి సాయం చేయలేదు. కనీసం సినిమా వేడుకలకు కూడా హాజరవ్వలేదు. కానీ భరత్ అనే నేను సినిమా ప్రీ రిలీజ్ వేడుకల్లో కనిపించడం మరింత అనుమానాలను కలిగించింది. అన్నయ్య సినిమా కోసం వెళ్లకుండా మరో స్టార్ హీరో వేడుకకి వెళ్లడం చూసి సోషల్ మీడియాలో అనేక రకాల ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే ఆ రూమర్స్ గురించి నందమూరి బ్రదర్స్ పట్టించుకోలేదు.

ఇక తారక్ అవన్నీ పుకార్లే అనే విధంగా చెప్పకనే చెప్పారు. ఓ విదంగా చూపించేశాడని చెప్పాలి. ప్రముఖ సినిమాటోగ్రఫర్ కేవీ గుహన్ దర్శకుడిగా మారుతూ కళ్యాణ్ రామ్ తో సినిమా చేయడానికి డిసైడ్ అయ్యాడు. సినిమా ఈ రోజే లాంచ్ అయ్యింది. ఈ వేడుకలో ఎన్టీఆర్ పాల్గొని చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలుపడంతో రూమర్స్ కి చెక్ పెట్టినట్లు అయ్యింది. ఎమ్మెల్యే సినిమా సమయంలో కాస్త బిజీగా ఉండడం వల్లే ఆ సినిమాకు సంబంధించిన ఫంక్షన్లకు రాలేదని తెలుస్తోంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో మాత్రం తారక్ తన ప్రమేయం ఉండేలా చూసుకుంటాడని టాక్.