Begin typing your search above and press return to search.
కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్న అరవింద సమేత..!
By: Tupaki Desk | 19 Sep 2018 10:11 AM GMTతెలుగు కమర్షియల్ చిత్రాలంటే ఆరు పాటలు, మూడు కామెడీ సీన్స్, మూడు ఫైట్ సీన్స్ అనే ట్రెండ్ కొనసాగుతున్న విషయం తెల్సిందే. ఫక్త్ కమర్షియల్ ఎంటర్టైనర్గా ఒక చిత్రం ప్రేక్షకుల మెప్పు పొందాలంటే పై ఎలిమెంట్స్ తప్పనిసరిగా ఫాలో అవ్వాల్సిందే. అయితే ఈమద్య ట్రెండ్కు భిన్నంగా తెరకెక్కిన చిత్రాలు కూడా ప్రేక్షకుల ఆధరాభిమానాలను దక్కించుకుంటున్నాయి. కమర్షియల్ సినిమాలు అంటే ఖచ్చితంగా ఆరు పాటలు ఉండాల్సిందే అనే ఆలోచనను ఫిల్మ్ మేకర్స్ మెల్ల మెల్లగా తీసేస్తున్నారు. అరవింద సమేత చిత్రంతో త్రివిక్రమ్ కూడా కొత్త ట్రెండ్కు శ్రీకారం చుడుతున్నాడు.
ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అరవింద సమేత’ చిత్రంలో కేవలం నాలుగు పాటలు మాత్రమే ఉండబోతున్నట్లుగా క్లారిటీ వచ్చేసింది. నాలుగు పాటల్లో ఒక పాట బ్యాక్ డ్రాప్ లో వచ్చేది కాగా, మిగిలిన మూడు పాటలు మాత్రమే కమర్షియల్ గా ఉంటాయని సమాచారం అందుతుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో గతంలో వచ్చిన సినిమాల్లో రెగ్యులర్గానే పాటలు ఉండేవి. కాని ఈసారి మాత్రం కేవలం నాలుగు పాటలతోనే త్రివిక్రమ్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
తాజాగా ‘అరవింద సమేత’ చిత్రం ఆడియో సీడీ కవర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. దానిపై నాలుగు పాటు మాత్రమే ఈ చిత్రంలో ఉన్నట్లుగా ఉంది. తమన్ ట్యూన్ చేసిన ఈనాలుగు పాటలు కూడా ప్రేక్షకులను అలరించే విధంగా ఉంటాయి అంటూ చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఇప్పటికే విడుదలైన ఒక పాట ప్రేక్షకులను ఆకట్టుకుంది. మరో మూడు పాటలు ఎలా ఉంటాయో చూడాలి. ఇక ఎన్టీఆర్ చిత్రం వస్తుందంటే అంటే నందమూరి అభిమానులు ఆయన డాన్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కాని ఈ చిత్రంలో ఎక్కువ పాటలు లేని కారణంగా ఎన్టీఆర్ డాన్స్ ను చూసే అవకాశం ఉండదేమో అంటూ అభిమానులు కాస్త ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ఆ లోటును త్రివిక్రమ్ ఎలా భర్తీ చేస్తాడో అని సినీ వర్గాల వారు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
పూజా హెగ్డే హీరోయిన్ గా తెరకెక్కిన ఈచిత్రంను దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో నాగబాబు కీలక పాత్రలో నటించిన కారణంగా సినిమాపై మరింత ఆసక్తి రేకెత్తుతోంది.
ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అరవింద సమేత’ చిత్రంలో కేవలం నాలుగు పాటలు మాత్రమే ఉండబోతున్నట్లుగా క్లారిటీ వచ్చేసింది. నాలుగు పాటల్లో ఒక పాట బ్యాక్ డ్రాప్ లో వచ్చేది కాగా, మిగిలిన మూడు పాటలు మాత్రమే కమర్షియల్ గా ఉంటాయని సమాచారం అందుతుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో గతంలో వచ్చిన సినిమాల్లో రెగ్యులర్గానే పాటలు ఉండేవి. కాని ఈసారి మాత్రం కేవలం నాలుగు పాటలతోనే త్రివిక్రమ్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
తాజాగా ‘అరవింద సమేత’ చిత్రం ఆడియో సీడీ కవర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. దానిపై నాలుగు పాటు మాత్రమే ఈ చిత్రంలో ఉన్నట్లుగా ఉంది. తమన్ ట్యూన్ చేసిన ఈనాలుగు పాటలు కూడా ప్రేక్షకులను అలరించే విధంగా ఉంటాయి అంటూ చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఇప్పటికే విడుదలైన ఒక పాట ప్రేక్షకులను ఆకట్టుకుంది. మరో మూడు పాటలు ఎలా ఉంటాయో చూడాలి. ఇక ఎన్టీఆర్ చిత్రం వస్తుందంటే అంటే నందమూరి అభిమానులు ఆయన డాన్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కాని ఈ చిత్రంలో ఎక్కువ పాటలు లేని కారణంగా ఎన్టీఆర్ డాన్స్ ను చూసే అవకాశం ఉండదేమో అంటూ అభిమానులు కాస్త ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ఆ లోటును త్రివిక్రమ్ ఎలా భర్తీ చేస్తాడో అని సినీ వర్గాల వారు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
పూజా హెగ్డే హీరోయిన్ గా తెరకెక్కిన ఈచిత్రంను దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో నాగబాబు కీలక పాత్రలో నటించిన కారణంగా సినిమాపై మరింత ఆసక్తి రేకెత్తుతోంది.