Begin typing your search above and press return to search.

మ‌హేష్‌, ఎన్టీఆర్‌.. త‌ర్వాత ప్ర‌భాసే

By:  Tupaki Desk   |   5 Feb 2016 3:32 PM GMT
మ‌హేష్‌, ఎన్టీఆర్‌.. త‌ర్వాత ప్ర‌భాసే
X
శ్రీమంతుడు సినిమాతో టాలీవుడ్ లోకి అదిరిపోయే ఎంట్రీ ఇచ్చింది మైత్రీ మూవీస్‌. తొలి ప్ర‌య‌త్నంలోనే రికార్డ్ బ్రేకింగ్ మూవీని అందించి టాలీవుడ్ లో త‌న ప్ర‌స్థానాన్ని అద్భుతంగా ఆరంభించిన మైత్రి మూవీస్‌.. ఆ త‌ర్వాత కూడా ఆచితూచి అడుగులు వేస్తోంది. జూనియ‌ర్ ఎన్టీఆర్‌ - కొర‌టాల శివ‌ల క్రేజీ కాంబినేష‌న్లో జ‌న‌తా గ్యారేజ్ సినిమాను ఆరంభించి ఇండ‌స్ట్రీ దృష్టిని ఆక‌ర్షించింది. ఇంత‌లోనే త‌మిళంలోకి కూడా ఎంట్రీ ఇవ్వ‌డం కోసం భారీ ప్ర‌ణాళిక‌ల‌తో ఉన్న ఈ సంస్థ.. తెలుగులో త‌మ మూడో సినిమా విష‌యంలోనూ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తోంది.యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ తో త‌మ మూడో సినిమా చేయాల‌ని మైత్రి మూవీస్ వ్యూహ‌ర‌చ‌న చేస్తున్న‌ట్లు స‌మాచారం.

ఇందుకోసం ఆల్రెడీ ప్ర‌భాస్ కు భారీ మొత్తంలో అడ్వాన్స్ కూడా ఇచ్చేశార‌ట మైత్రి మూవీస్ అధినేత‌లు. ప్ర‌భాస్ ప్ర‌స్తుతం బాహుబ‌లి-2 ప‌నుల్లో బిజీగా ఉన్న‌ప్ప‌టికీ.. అతను ఆ సినిమా నుంచి బ‌య‌టికి వ‌చ్చాక ర‌న్ రాజా ర‌న్ ఫేమ్ సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో యువి క్రియేష‌న్స్ లో ఓ సినిమా చేయాల్సి ఉన్న‌ప్ప‌టికీ.. అత‌ను ఎప్పుడు ఖాళీ అయినా త‌మ‌తో సినిమా చేసేలా ప్లాన్ చేస్తోంద‌ట మైత్రి మూవీస్‌. మొత్తానికి అదిరిపోయే కాంబినేష‌న్లు సెట్ చేస్తూ త‌మ ప్ర‌త్యేక‌త చాటుకుంటున్న మైత్రి మూవీస్ మున్ముందు టాలీవుడ్ బిగ్ బేన‌ర్ల‌లో ఒక‌టిగా ఎదిగే అవ‌కాశం క‌నిపిస్తోంది.మ‌రి మైత్రి మూవీస్ బేన‌ర్లో ప్ర‌భాస్ చేయ‌బోయే సినిమాకు ద‌ర్శ‌కుడెవ‌రో మ‌రి. తొలి రెండు సినిమాలు చేసిన కొర‌టాల‌నే లైన్లో పెడ‌తారా?