Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: కొత్త హీరోతో మెగా ఫ్యామిలి

By:  Tupaki Desk   |   21 Jan 2019 7:49 AM GMT
ఫోటో స్టొరీ: కొత్త హీరోతో మెగా ఫ్యామిలి
X
మెగా ఫ్యామిలీ నుండి వస్తున్న కొత్త మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ డెబ్యూ సినిమాను ఈ రోజే హైదరాబాద్ లో లాంచ్ చేశారు. దాదాపు మెగా ఫ్యామిలీ అంతా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి.. నాగబాబు.. అల్లు అర్జున్.. వరుణ్ తేజ్.. సాయి ధరమ్ తేజ్ తదితరులు ఈ కార్యక్రమంలో సందడి చేశారు.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నిర్మాతలకు స్క్రిప్ట్ ను అందించగా మెగా బ్రదర్ నాగబాబు మొదటి షాట్ కు క్లాప్ కొట్టారు. ఈ సందర్భంగా చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్ తేజ్ కు తన దీవెనలు అందజేశారు. సుకుమార్ - మైత్రీ మూవీ మేకర్స్ వారిది సక్సెస్ఫుల్ కాంబినేషన్ అని.. తన మేనల్లుడు ఈ అద్భుత అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షించారు. దర్శకుడు బుచ్చిబాబు సాన తనకు కథ చెప్పినప్పుడు థ్రిల్ అయ్యాయని తెలిపారు. ఇదో రస్టిక్ లవ్ స్టొరీ అని.. విజయం సాధించాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఈ సందర్భంగా యూనిట్ సభ్యులందరికీ అభినందనలు తెలిపారు. యువకులను వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నందుకు సుకుమార్ ను ప్రత్యేకంగా ప్రశంసించారు.

పైనున్న లాంచ్ ఫోటోలో కొత్త హీరో.. న్యూ డైరెక్టర్ లతో చిరంజీవి.. సాయి ధరమ్ తేజ్.. అల్లు అర్జున్.. వరుణ్ తేజ్ లు చిరు నవ్వులు చిందిస్తూ పోజు ఇచ్చారు. మనీషా రాజ్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. దేవీ శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్.. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.