Begin typing your search above and press return to search.

మెగా హీరోలు 'ఉక్రెయిన్' మీద పడ్డారేంటో

By:  Tupaki Desk   |   27 Oct 2016 4:28 AM GMT
మెగా హీరోలు ఉక్రెయిన్ మీద పడ్డారేంటో
X
మన తెలుగులో మామూలుగానే ఒకళ్లు ఒక కంట్రీకి వెళ్లి ఏదన్నా షూట్ చేశారంటే చాలు.. అందరూ అటే వెళుతుంటారు. పూరి బ్యాంకాక్ అంటే అందరూ బ్యాంకాక్ వెళ్లారు. తరువాత శ్రీను వైట్ల స్పెయిన్ అంటే అందరూ అక్కడే తిష్ట వేశారు. అయితే ఇప్పుడు ఒకటే ఫ్యామిలీకి చెందిన ముగ్గురు హీరోలు అలాగే ఒక కొత్త కంట్రీకి వెళుతున్నారు.

ఆల్రెడీ మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెం.150 సినిమాలోని రెండు పాటలను కూడా ఉక్రెయిన్ దేశంలోనే తీస్తున్నారు. గతంలో సోవియట్ యునియన్ లో భాగమైన ఈ యురోపియన్ దేశం.. ఇప్పుడు ఫిలింస్ తీసుకునేవారికి సౌలభ్యం కలిపిస్తే చక్కగా అక్కడ టూరిస్టులు సంఖ్య పెరుగుతోంది అనుకున్నారు కాబోలు. ఇక డాడ్ ను ఫాలో అవుతూ.. అదే ప్లేసులో రామ్ చరణ్‌ కూడా ''ధృవ'' సినిమా పాటలను షూట్ చేస్తున్నాడు. ఇప్పుడు కొత్త ట్విస్ట్ ఏంటంటే.. ధృవ హీరోయిన్ రకుల్ ప్రీత్ తో మూడు పాటలు షూట్ చేయడానికి ఇప్పుడు ''విన్నర్'' సాయిధరమ్ తేజ్ కూడా ఉక్రెయిన్ వెళుతున్నాడు.

అంతా బాగానే ఉంది కాని.. అసలు ఉక్రెయిన్ పేరు చెబితేనే ఇక్కడ సినిమా లవర్స్ కు తడిసిపోతోంది. జస్ట్ వాళ్ల దేశం మీద నుండి వెళుతున్న మలేషియన్ ఎయిర్ లైన్స్ ఫ్లయిట్ 17ను 2014లో ఒక మిస్సయిల్ తో కూల్చేశారు గుర్తుందా? వందలమంది చనిపోయారు కూడా. అదే సమయంలో ఉక్రెయిన్ లో సంక్షోభయం.. రష్యాతో క్రిమియా తాలూకు గొడవ.. వామ్మో రచ్చరచ్చైపోయింది. అందుకే ఉక్రెయిన్ లో షూట్ అంటే ఎక్సయిట్మెంట్ కంటే ఎక్కువ అభిమానులకు భయంగా ఉంది!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/