Begin typing your search above and press return to search.

12 ఏళ్ళ తర్వాత.. ఆ హిట్ సినిమాకు సీక్వెల్

By:  Tupaki Desk   |   18 Feb 2019 5:09 AM GMT
12 ఏళ్ళ తర్వాత.. ఆ హిట్ సినిమాకు సీక్వెల్
X
బయోపిక్ ల ట్రెండ్ మాత్రేమే ఊపందుకుందని మనం అనుకుంటున్నాం కానీ సీక్వెల్స్ ట్రెండ్ కూడా నెమ్మదిగా ఆరంభమైంది. ఇప్పటికే అక్కినేని నాగార్జున హీరోగా 'చిలసౌ' ఫేం రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో 'మన్మధుడు' సీక్వెల్ కు సన్నాహాలు జరుగుతున్నాయి. అంతలోపు మరో ఇంట్రెస్టింగ్ సీక్వెల్ తెరపైకి వచ్చింది.

2007 లో రిలీజ్ అయిన కామెడీ ఎంటర్టైనర్ 'ఢీ'. మంచు విష్ణు హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలోఈ సినిమా తెరకెక్కింది. జెనీలియా హీరోయిన్ గా నటించగా శ్రీహరి ఒక కీలక పాత్రలో నటించారు. అప్పట్లో సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా విష్ణు కెరీర్లో ఇప్పటికీ బిగ్గెస్ట్ హిట్ గానే ఉంది. అప్పట్లో 'ఢీ' తోనే శ్రీను వైట్ల విజయాల పరంపర మొదలయింది. అలాంటి సినిమాకు ఇప్పుడు దర్శకుడు శ్రీను వైట్ల సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడని సమాచారం.

ఈ సినిమాలో మంచు విష్ణుతో పాటుగా మరో యువ హీరో కూడా నటిస్తాడట. ప్రస్తుతానికి డిస్కషన్స్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమాకు సంబంధించిన ఈ సినిమా వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి. శ్రీను వైట్ల- మంచు విష్ణు ఇద్దరూ వరస పరాజయాలతో సతమతమవుతున్నారు. మరి ఈ క్రేజీ ఫిలిం సీక్వెల్ తో అయినా వారికి రిలీఫ్ దక్కుతుందేమో వేచి చూడాలి.